ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి

 



ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి


   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి అని స్టీల్  సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వైటి దాస్ పిలుపునిచ్చారు. ఈరోజు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఎస్ ఎం ఎస్-1 విభాగం కార్యకర్తల సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వైటి దాస్ మాట్లాడుతూ నేటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది అంటే ప్లాంట్ లో గుర్తింపు యూనియన్ గా సి ఐ టి యు వాటి మిత్రపక్షాలు చేస్తున్న కృషి అనిర్వచనీయం అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజలలో అవగాహన మరింత అభివృద్ధి చేసి ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఘనత సీఐటీయూ దక్కుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక సదస్సులకు రాష్ట్ర సిఐటియు సహకారంతో జరిగినవే అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే అంగన్వాడి, ఆశ వర్కర్స్, యువజనులు, మహిళా సంఘాల ప్రతినిధులు దీక్షా శిబిరానికి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారని, వీటికోసం సిఐటియు కృషి ఎంత ఉందో ప్లాంట్ లోని ప్రతి ఒక్క కార్మికుడు ఈ విషయాలను గమనించారని ఆయన అన్నారు. ఈ సమయంలో వేరొకరు గుర్తింపు లో ఉంటే దీని పై జరుగుతున్న దాడిని కార్మిక వర్గం వరకు తీసుకు వచ్చేవారా అని ఆయన ప్రశ్నించారు. కనుక రానున్న సమయంలో పోరాటాలను మరింత ఉధృతం చేయాలని తద్వారా ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించడంలో సిఐటియు ముఖ్యభూమిక పోషించాలి అంటే స్థానికంగా సిఐటియు మరింత బలోపేతం కావాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు నాయకులు బి. అప్పారావు, వి డి వి పూర్ణచంద్రరావు, బి.తౌడన్న, ఎమ్.వి.రమణ, బంగారు నాయుడు, కృష్ణమూర్తి, విశ్వనాథం, ముత్యాల నాయుడు, కె వి సాగర్, ఎమ్ ఎస్ రాజు, ఎలమంచిలి శ్రీనివాసరావు తదితరులతోపాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం