*విశాఖపట్నం జిల్లా (మాడుగుల)*
_*జీడిమామిడి తోటలు తొలగిస్తే... ఆత్మహత్యలే శరణ్యం*_
*జీడిమామిడి తోటలను తొలగిస్తే మాకు ఆత్మహత్యే దిక్కని మాడుగులలో మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.*
*- మామిడి కొమ్మలకు చీరలతో ఉరి వేసుకున్నట్లుగా వినూత్నంగా నిరసన తెలిపారు.*
*- తాము ఆక్రమణదారులం కాదని.. ప్రభుత్వమే భూములు ఇచ్చిందని స్పష్టం చేశారు.*
★ విశాఖ జిల్లా మాడుగుల రెవెన్యూ పరిధిలోని ఉరవకొండపై జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
వ్యక్తం చేశారు.
★ గురువారం మామిడి చెట్ల కొమ్మలకు చీరలతో ఉరి వేసుకున్నట్లు వినూత్నంగా నిరసన తెలిపారు.
★ _*"మేము ఆక్రమణదారులం కాదు. జీడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నాం. డీ పట్టా భూములను ప్రభుత్వమే ఇచ్చింది. ఎమ్మెల్యే, తహసీల్దారు గిరిజనులపై వివక్ష చూపడంతో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి"*_ అని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.