*- భూముల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం

 *అమరావతి*


_*కొత్త జిల్లాల్లో భూముల విలువ.. 75 శాతం వరకు పెంచిన సర్కార్*_


*కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్‌ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది.*


*- ప్రాంతాన్ని బట్టి దాదాపు 75 శాతం మేర హెచ్చించింది.*


*- ఇది కొనుగోలుదారులకు తీవ్ర భారంగా మారనుంది.*


*- భూముల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం జమకానుంది.*


★ రాష్ట్రంలోని 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెంచిన మార్కెట్‌ విలువలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 


★ కొత్త జిల్లాలు ఏర్పడిన రెండ్రోజుల్లోనే మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచేసింది. 


★ ఈ పెంపునకు ప్రత్యేక రివిజన్‌ అని పేరు పెట్టింది. 


★ జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా మార్కెట్‌ విలువలను సవరించారు. 


★ దీంతో రిజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో రెవెన్యూ శాఖకు కోట్లాది రూపాయలు అదనంగా రానున్నాయి. 


★ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోనికి వచ్చే అవకాశం ఉంది. 


★ ప్రస్తుతం కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్‌ను బట్టి మార్కెట్‌ విలువల్లో 13 నుంచి 75 శాతం వరకు పెంచారు. 


★ బాపట్ల, నరసరావుపేట జిల్లాల్లో ఫిబ్రవరి 1 నుంచే సవరించిన మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చాయి. 


★ తిరుపతి జిల్లాలో 4 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోని 68 గ్రామాల్లో కొత్త రిజిస్ట్రేషన్‌ ధరలు అమల్లోకి వచ్చాయి. 


★ జిల్లా పరిధిలో కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 75మేర భూముల ధరలు పెంచారు.


★ రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో కొన్ని గ్రామాల్లో 432 శాతం మేరకు భూముల విలువ పెంచేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. 


★ అప్పటి కమిటీని పర్యవేక్షిస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్‌ వీటికి ఆమోదముద్ర వేశారు. 


★ పెంపును 75 శాతానికి కుదించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 


★ ఈ మేరకు అధికారులు రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌రెడ్డిని విలువలను తగ్గించి తిరిగి ఫైల్‌ తీసుకురావాలని చెప్పగా ఆయన నిరాకరించారు. 


★ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందున ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.


★ 75 శాతం కంటే ఎక్కువగా పెంచిన భూముల మార్కెట్‌ విలువలను తిరిగి తగ్గించారు.


★ *విజయవాడ* పటమట రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని పెదపులిపాకలో మార్కెట్‌ విలువలు 37.25 శాతం పెరిగాయి. 


★ కానూరులో 13 వేల 500 ఉన్న గజం మార్కెట్‌ విలువను 17వేలకు పెంచారు. 


★ బందరు రోడ్డు ఇరువైపులా గజం 96 వేల 400 ఉండగా ..దీన్ని లక్షా 10వేలకు పెంచారు. 


★ కొవ్వూరు పట్టణం ఔరంగాబాద్‌ ప్రాంతంలో ఇప్పటివరకు ఎకరం భూమి విలువ 35లక్షలు ఉంది. ఇప్పుడు ఈ పట్టణం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లడం వల్ల...ఎకరం విలువ 42 లక్షలకు చేరింది. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరానికి సమీపంలో ఉండడం వల్లే ఇంత పెరిగింది. 


★ రాజమహేంద్రవరం కోటగుమ్మం మెయిన్‌రోడ్డులో గజం స్థలం 76వేల నుంచి 86వేలకు పెరిగింది. దేవీచౌక్‌లో గజం 42వేల నుంచి 48వేలకు పెరిగింది. 


★ కొత్తగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాలోనూ భూముల మార్కెట్‌ విలువలు పెరిగాయి. 


★ అమలాపురంలో గజం 18వేల నుంచి 22 వేల 500కు చేరాయి.


★ పేరూరులో 8వేల 500 నుంచి 12 వేల 500కు పెరిగింది.


★ భీమవరం, గునుపూడి, వీరవాసరం, ఉండి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 30 ప్రాంతాల్లో కొత్తగా భూముల విలువ పెంచారు. 


★ 20 శాతమే పెంచినట్లు అధికారులు చెబుతున్నా.. 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 


★ అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని 76 ప్రాంతాల్లో 16 నుంచి 30 శాతం పెంచినట్లు చెబుతున్నా ... సంపతిపురం, ఊడేరులో 50 శాతం పెరుగుదల కనిపించింది.


★ తాళ్లపాలెంలో ఎకరా 26 లక్షలు ఉంటే ఇప్పుడు 33 లక్షలు చేశారు. 


★ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు పట్టణానికి ఆనుకొని ఉన్న 5 కిలోమీటర్లలోపు 6 గ్రామాల్లోనూ ధరలు పెరిగాయి. 


★ ప్రాంతాన్ని బట్టి సుమారు 25 నుంచి 30 శాతం పెంచారు. 


★ పార్వతీపురంతో పాటు కొమరాడ మండలం శివినిలోనూ ధరలను సవరించారు. 


★ ప్రధాన రహదారిలో గజం 18వేల నుంచి 26వేలకు....4 వేల 500 ఉన్నచోట 5వేల 8వందలకు... 6వేలు ఉన్న ప్రాంతంలో 8వేలకు పెంచారు.