*అమరావతి*
_*కొత్త జిల్లాల్లో భూముల విలువ.. 75 శాతం వరకు పెంచిన సర్కార్*_
*కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది.*
*- ప్రాంతాన్ని బట్టి దాదాపు 75 శాతం మేర హెచ్చించింది.*
*- ఇది కొనుగోలుదారులకు తీవ్ర భారంగా మారనుంది.*
*- భూముల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం జమకానుంది.*
★ రాష్ట్రంలోని 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెంచిన మార్కెట్ విలువలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
★ కొత్త జిల్లాలు ఏర్పడిన రెండ్రోజుల్లోనే మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచేసింది.
★ ఈ పెంపునకు ప్రత్యేక రివిజన్ అని పేరు పెట్టింది.
★ జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా మార్కెట్ విలువలను సవరించారు.
★ దీంతో రిజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో రెవెన్యూ శాఖకు కోట్లాది రూపాయలు అదనంగా రానున్నాయి.
★ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోనికి వచ్చే అవకాశం ఉంది.
★ ప్రస్తుతం కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్ను బట్టి మార్కెట్ విలువల్లో 13 నుంచి 75 శాతం వరకు పెంచారు.
★ బాపట్ల, నరసరావుపేట జిల్లాల్లో ఫిబ్రవరి 1 నుంచే సవరించిన మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి.
★ తిరుపతి జిల్లాలో 4 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 68 గ్రామాల్లో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి వచ్చాయి.
★ జిల్లా పరిధిలో కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 75మేర భూముల ధరలు పెంచారు.
★ రేణిగుంట సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో కొన్ని గ్రామాల్లో 432 శాతం మేరకు భూముల విలువ పెంచేందుకు సబ్రిజిస్ట్రార్ ఆనంద్రెడ్డి ప్రతిపాదనలు పంపించారు.
★ అప్పటి కమిటీని పర్యవేక్షిస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్ వీటికి ఆమోదముద్ర వేశారు.
★ పెంపును 75 శాతానికి కుదించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
★ ఈ మేరకు అధికారులు రేణిగుంట సబ్రిజిస్ట్రార్ ఆనంద్రెడ్డిని విలువలను తగ్గించి తిరిగి ఫైల్ తీసుకురావాలని చెప్పగా ఆయన నిరాకరించారు.
★ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందున ఆయన్ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
★ 75 శాతం కంటే ఎక్కువగా పెంచిన భూముల మార్కెట్ విలువలను తిరిగి తగ్గించారు.
★ *విజయవాడ* పటమట రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని పెదపులిపాకలో మార్కెట్ విలువలు 37.25 శాతం పెరిగాయి.
★ కానూరులో 13 వేల 500 ఉన్న గజం మార్కెట్ విలువను 17వేలకు పెంచారు.
★ బందరు రోడ్డు ఇరువైపులా గజం 96 వేల 400 ఉండగా ..దీన్ని లక్షా 10వేలకు పెంచారు.
★ కొవ్వూరు పట్టణం ఔరంగాబాద్ ప్రాంతంలో ఇప్పటివరకు ఎకరం భూమి విలువ 35లక్షలు ఉంది. ఇప్పుడు ఈ పట్టణం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లడం వల్ల...ఎకరం విలువ 42 లక్షలకు చేరింది. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరానికి సమీపంలో ఉండడం వల్లే ఇంత పెరిగింది.
★ రాజమహేంద్రవరం కోటగుమ్మం మెయిన్రోడ్డులో గజం స్థలం 76వేల నుంచి 86వేలకు పెరిగింది. దేవీచౌక్లో గజం 42వేల నుంచి 48వేలకు పెరిగింది.
★ కొత్తగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాలోనూ భూముల మార్కెట్ విలువలు పెరిగాయి.
★ అమలాపురంలో గజం 18వేల నుంచి 22 వేల 500కు చేరాయి.
★ పేరూరులో 8వేల 500 నుంచి 12 వేల 500కు పెరిగింది.
★ భీమవరం, గునుపూడి, వీరవాసరం, ఉండి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 30 ప్రాంతాల్లో కొత్తగా భూముల విలువ పెంచారు.
★ 20 శాతమే పెంచినట్లు అధికారులు చెబుతున్నా.. 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
★ అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 76 ప్రాంతాల్లో 16 నుంచి 30 శాతం పెంచినట్లు చెబుతున్నా ... సంపతిపురం, ఊడేరులో 50 శాతం పెరుగుదల కనిపించింది.
★ తాళ్లపాలెంలో ఎకరా 26 లక్షలు ఉంటే ఇప్పుడు 33 లక్షలు చేశారు.
★ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు పట్టణానికి ఆనుకొని ఉన్న 5 కిలోమీటర్లలోపు 6 గ్రామాల్లోనూ ధరలు పెరిగాయి.
★ ప్రాంతాన్ని బట్టి సుమారు 25 నుంచి 30 శాతం పెంచారు.
★ పార్వతీపురంతో పాటు కొమరాడ మండలం శివినిలోనూ ధరలను సవరించారు.
★ ప్రధాన రహదారిలో గజం 18వేల నుంచి 26వేలకు....4 వేల 500 ఉన్నచోట 5వేల 8వందలకు... 6వేలు ఉన్న ప్రాంతంలో 8వేలకు పెంచారు.