*భారత్/మహారాష్ట్ర*
_*కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్ ఎక్స్ఈ' భారత్లోకి ప్రవేశించింది.*_
*ముంబయిలో తొలి కేసును అధికారులు గుర్తించారు.*
★ అయితే.. ఇది ఎక్స్ఈ వేరియంట కాకపోవచ్చని ఇన్సాకాగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
★ కరోనా వైరస్ ఒమిక్రాన్ రకం కన్నా 10శాతం వేగంగా వ్యాపించగల సరికొత్త వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసింది.
★ 'ఒమిక్రాన్ ఎక్స్ఈ' రకం కరోనా వైరస్ను ముంబయిలో గుర్తించినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.
★ మొత్తం 376 సాంపిల్స్కు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఒకరిలో ఎక్స్ఈ, మరొకరిలో కప్పా వేరియంట్ గుర్తించినట్లు వివరించారు.
★ ఈ కొత్త వేరియంట్లు సోకిన రోగుల పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు.
★ ముంబయిలో తాము పరీక్షించిన 230 సాంపిల్స్లో.. 228 కేసుల్లో ఒమిక్రాన్గా తేలిందని ఆ అధికారి చెప్పారు.
★ భారత్లో కొంతకాలంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది.
★ ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 రకాల కలయికతో 'ఒమిక్రాన్ ఎక్స్ఈ' వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
★ బీఏ.2 రకంతో పోల్చితే ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ 9.8శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేశారు.
★ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల ఇదే విషయం చెప్పింది.
★ ముంబయిలోని సాంపిల్ ఎక్స్ఈ వేరియంట్కు చెందినదిగా ప్రస్తుత ఆధారాలు సూచించడంలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
★ ఎక్స్ఈ వేరియంట్గా భావిస్తున్న సాంపిల్ ఫాస్ట్ క్యూ ఫైల్స్.. ఇన్సాకాగ్కు చెందిన జన్యు నిపుణులు క్షుణ్నంగా పరిశీలించినట్లు.
★ ఆ సాంపిల్ జన్యుక్రమం ఎక్స్ఈ వేరియంట్ జన్యుచిత్రంతో సరిపోలడం లేదని ఆయా వర్గాలు వివరించాయి.