ప్రభుత్వ తీరుతో... ప్రశ్నార్ధకంగా విజయవాడ ఆటోనగర్‌ మనుగడ*_


 *విజయవాడ (ఆటోనగర్)*


_*ప్రభుత్వ తీరుతో... ప్రశ్నార్ధకంగా విజయవాడ ఆటోనగర్‌ మనుగడ*_


*ఆసియాలోనే అతి పెద్దదిగా పేరొందిన విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌ మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది.*


*- ఆటోనగర్‌ను కమర్షియల్‌ ప్రాంతంగా పేర్కొంటూ... ప్రభుత్వం జీవోలు తేవడంపై కార్మికులు, వ్యాపారులు భగ్గుమంటున్నారు.*


*- మార్కెట్‌ విలువ ప్రకారం 50శాతం పన్ను రూపేణా వసూలుకు సిద్ధమవడాన్ని తప్పుపడుతున్నారు.*


★ దేశంలో ఏర్పాటైన తొలి ఆటోనగర్‌గా విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌కు పేరు. 


★ ఆటో మొబైల్‌, వాహనాల విడిభాగాల తయారీ, అమ్మకాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. 


★ 1966లో బెజవాడ శివారులో పారిశ్రామిక ఎస్టేట్‌ పక్కన సుమారు 275ఎకరాల స్థలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. 


★ దీనిపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు.


★ లారీలు, బస్సులకు బాడీలు కట్టడంలో ఈ ప్రాంతానికి ఎంతో పేరుంది. 


★ ఛాసిస్ వాహనాన్ని తీసుకొచ్చి కార్మికులకు అప్పగిస్తే చాలు... యజమాని అభిరుచి మేరకు ఎలా కావాలంటే అలా బాడీలు కట్టి ఇస్తారు. 


★ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశాకు చెందిన యజమానులు ఇక్కడికే వచ్చి లారీలకు బాడీలు కట్టించుకొని వెళ్తుంటారు. 


★ అంతగా ప్రసిద్ధి చెందిన ఆటోనగర్‌కు... ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబరు జీవోలు గుదిబండగా మారాయి. 


★ ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్​గా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని కార్మికులు, వ్యాపారులు తప్పుపడుతున్నారు.

_*పరిశ్రమలు తరలిపోతే రాష్ట్ర మనుగడకే ప్రమాదం..*_

★ 60వ దశకంలో తాము స్థలాలు ఉచితంగా పొందలేదని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.

★ ఆటోనగర్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. 

★ 50 శాతం పన్ను కట్టాలంటే ఇక వ్యాపారాలు వదులుకోవటమేనని అంటున్నారు.


★ చిన్న చిన్న పరిశ్రమలు ఉండే ప్రాంతాన్ని కమర్షియల్‌ చేస్తామంటే ఉపేక్షించేదే లేదని తేల్చిచెప్తున్నారు.

★ చిన్న పరిశ్రమలు నడుపుకునే వారు పెద్దమొత్తంలో పన్నులెలా కడతారని వ్యాపారులు నిలదీస్తున్నారు. 

★ పరిశ్రమలు తరలిపోతే రాష్ట్ర మనుగడకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

_*ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం..*_

★ ఆటోనగర్​కు ప్రస్తుతం వాహనాలు భారీ సంఖ్యలో వచ్చే పరిస్థితులు లేవని .. బతుకే కష్టంగా ఉన్న సమయంలో పన్నుల వాతలేంటని ప్రశ్నిస్తున్నారు. 

★ ఆటోనగర్‌ను ఆనుకుని ఉన్న కానూరు పారిశ్రామిక ప్రాంతాన్ని సొంతగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏపీఐఐసీకి సర్వీస్ ఛార్జీ రూపేణా రుసుము కడుతున్న విషయాన్ని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. 

★ 5, 6 జీవోలను ఉపసంహరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం