నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని కరెంటు కష్టాలు

 *విశాఖపట్నం జిల్లా (నర్సీపట్నం)*

_*టార్చిలైట్ల వెలుగులో ప్రసవం... పసికందు సైతం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు*_


*నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని కరెంటు కష్టాలు వెన్నాడుతున్నాయి.*


*- బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు, బాలింతలు, గర్భిణులు విలవిల్లాడారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలుకావడంతో టార్చిలైట్ల వెలుగులో వైద్యులు ప్రసవం చేయాల్సి వచ్చింది.*


★ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని కరెంటు కష్టాలు వెన్నాడుతున్నాయి. 


★ బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు, బాలింతలు, గర్భిణులు విలవిల్లాడారు. 


★ జనరేటర్‌ ఉన్నా అది పనిచేయలేదు.


★ ముఖ్యమైన విభాగాల్లో ఇన్వర్టర్లు రెండు గంటలు పనిచేశాక మొరాయించాయి. 


★ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలుకావడంతో టార్చిలైట్ల వెలుగులో వైద్యులు ప్రసవం చేయాల్సి వచ్చింది. 


★ జనరేటర్‌ పాడైన విషయాన్ని విశాఖపట్నంలోని సంబంధిత కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా.. ఉదయం మెకానిక్‌లు వచ్చి మధ్యాహ్నానికి బాగు చేశారు.


★ గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.


★ ఆ సమయంలో జనరేటర్‌పై ఫ్యాన్లు, లైట్లు మాత్రం పనిచేశాయి. 


★ రాత్రి వేళ కరెంటు పోతే ఇబ్బంది అవుతుందని రోగుల బంధువుల్లో కొందరు బ్యాటరీతో పనిచేసే టేబుల్‌ ఫ్యాన్లను కొనుక్కుని తెచ్చుకున్నారు. 


★ ఆసుపత్రిలో శుద్ధజలం ప్లాంటు మూడు రోజులుగా పనిచేయడం లేదు.


★ రోగుల సహాయకులు ఇళ్ల నుంచి సీసాలతో నీటిని తెచ్చుకుంటున్నారు.


★ ఆసుపత్రి ఇన్‌ఛార్జి పర్యవేక్షకులు డాక్టర్‌ డేవిడ్‌ వసంత్‌కుమార్‌ను వివరణ కోరగా.. జనరేటరు, మోటారు పాడైనప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 


★ విద్యుత్తు లేనప్పుడు ప్రసూతి విభాగంలో టార్చిలైట్లు, సెల్‌ఫోన్ల వెలుగులో ప్రసవం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా.. _*‘ప్రసవాన్ని వాయిదా వేయలేం కదా’*_ అని పేర్కొన్నారు.


★ శుద్ధజలం ప్లాంట్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.