భీమిలి ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఈరోజు మంత్రి వర్యులు ఆద్వర్యం లో రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం
 విశాఖపట్నం, ఏప్రిల్ 6:


భీమిలిపట్నంలో అతి ముఖ్యమైన చారిత్రాత్మక ప్రారంభోత్సవాలు చేసిన పర్యాటక శాఖ మంత్రి....

    ఈరోజు అనగా తేది 06-04-2022 నాడు భీమిలి ప్రజలు  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రాముఖ్యమైన వాటిలో ఒకటైన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కి వెళ్ళడానికి భక్తులు కోసం 73 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డు ను ఈరోజు అనగా తేది 06-04-2022 నాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం 100 ఏళ్ళు చరిత్ర పైబడి కలిగిన భీమిలి ప్రభుత్వం హాస్పిటల్ లో 3 కోట్ల రూ లతో అత్యంత ఆధునికత  వసతులుతో కూడిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను  మంత్రి వర్యులు ప్రారంబించారు. ప్రారంభోత్సవం ను ఉద్దేశించి మంత్రి వర్యులు మాట్లాడుతూ సుందరీకరణ తో శుభ్రంగా హాస్పిటల్ నిర్మించిన అధికారులకు దన్యవాదాలు తెలిపారు. భీమిలి చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా  నా హయాంలో ప్రత్యేక మైన దృష్టి పెట్టి హాస్పిటల్ ను త్వరితగతిన పూర్తి చేసి రోగులకు అందుబాటులోనికి తీసుకురావడం   చాలా సంతోషంగా ఉందని , నాడు నేడు లో బాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యతో పాటు వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి  మెడికల్ కళాశాలలు ప్రతీ గ్రామంలో విలీజీ క్లినిక్ లు , పిహేచ్ సి లు, అర్బన్ ఏరియాలో వెల్ నెస్ సెంటర్స్, భీమిలి నియోజకవర్గం లో త్వరితగతిన ఈ పనులు జరుగుతున్నాయని అందులో కొన్ని హాస్పిటల్ కు వెల్ నెస్ సెంటర్స్ కు రెవెన్యూ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా తగినంత స్థలాలు కేటాయించాలని అధికారులకు సూచించడం జరుగింది,కూడా అంతేకాక గర్భిణీ స్త్రీలకు 1 నెల నుండి 9 నెల వరుకూ క్రమం తప్పకుండా ఆశావర్కర్లు ఆయాలతో పౌష్టికాహారం ఇవ్వడం , అలాగే తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ , 108 అంబులెన్స్ లు తీసుకురావడం జరిగిందని,  కరోనా సమయంలో వ్యాక్సిన్ ప్రక్రియలో రాష్త్రం కి చాలా మంచి పేరు వచ్చేలా ముఖ్యమంత్రి చేసారని , అలాగే జిల్లా లో మంచి సేవలు అందించిన ఆశావర్కర్లు, ఏయన్ యమ్ లకు , వైద్య బృందం కి ధన్యవాదాలు తెలిపారు.. 

ఈ 30 పడకల ఆసుపత్రి ని కేజిహేచ్ కు సరి సమానంగా 50 పడకల ఆసుపత్రి గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేయడం జరిగింది . హాస్పిటల్ నిర్మించినందుకు మంత్రి అవంతి కి ప్రజలు సంతోషంతో దన్యవాదాలు తెలిపారు...  అనంతరం 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి దానిలో భాగంగా భీమిలి ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఈరోజు మంత్రి వర్యులు ఆద్వర్యం లో రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, భీమిలి నియోజకవర్గం లో వైసిపి పార్టీ శ్రేణులతో  థ్యాంక్యూ సియం నినాదాలతో  బారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చైర్ పర్సన్ సుభద్ర గారు, VMRDA చైర్ పర్సన్ విజయ నిర్మల గారు, యంయల్సి వరుదు కళ్యాణి గారు, ఆర్డీవో భాస్కర్ రెడ్డి గారు భీమిలి నియోజకవర్గం కార్పోరేటర్ లు, జెడ్పిటిసి లు, యంపిపి లు, వైస్ యంపిపి లు , వార్డు ప్రెసిడెంట్ లు ,  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి