130కు పైగా వినతులు స్వీకరించిన విజయసాయి రెడ్డి*

 విశాఖపట్నం (ఏప్రిల్ 8)


*ప్రజాదర్బార్ కు పోటెత్తిన వినతులు*


*130కు పైగా వినతులు స్వీకరించిన విజయసాయి రెడ్డి*



*అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పలు వినతులు పరిష్కారం*



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిజిహెచ్ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్) అదనపు డైరెక్టర్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ ట్రీట్ మెంట్ బిల్లులు,  రిఫరల్ ఆసుపత్రులకు సంబంధించిన పనుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని, ఒక్క విశాఖపట్నంలోనే 25వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు నివసిస్తున్నాయని, సుమారు లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారని సీతమ్మధార కు చెందిన బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి ఆర్ కే శర్మ వినతి పత్రం అందించారు. అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం సీతమ్మధారలోని ఎంపీ విజయసాయి రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వినతులు, పిర్యాదులు అందజేశారు. నమ్మివానిపేటకు చెందిన నమ్మి గంగులు, పీతల లోకేష్ లు తాము జివిఎంసి లో గత 10 సంవత్సరాలుగా వేయింగ్ మెషిన్ లో కాంట్రాక్టర్ వద్ద పనిచేసామని, కాంట్రాక్ట్ కాలపరిమితి ముగియడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, సుమారు 15 మంది ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నామని ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా తమకు ఉద్యోగం కల్పించాలని కోరారు. ఎంవిపి కాలనీలో హిడెన్ స్ప్రౌట్స్ పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వాహకులు, ఆశ్రమానికి స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సీతమ్మధార, బాల వికాస్ ఫౌండేషన్ ఫౌండర్ నరవ ప్రకాష్ రావు, ఉడా చిల్డ్రన్ థియేటర్ లో చిన్న పిల్లలకు సంబందించి కార్యక్రమాలు కోవిడ్ కారణంగా నిలిపివేయడం జరిగిందని, తిరిగి వాటిని పునరుద్దరించాలని, పిల్లలకు ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు నిర్వహించాలని వినతిపత్రం అందించారు. జీవీఎంసీ పరిధిలో ఆరిలోవ, శ్రీహరిపురంలలోని ఎఫ్ఆర్ యు (ఫస్ట్ రిఫరల్ యూనిట్) లలో పనిచేస్తున్న సుమారు 26 మంది వైద్యసిబ్బందికి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, తామంతా రెడ్ క్రాస్, సీడ్స్ సంస్థల ఆద్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని, బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించే ఏర్పాటు చేయడంతో పాటు తమను ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి చేర్చాలని కోరుతూ ఆరిలోవ ఎఫ్ ఆర్ యు వైద్య ఉద్యోగి మణి వినతి పత్రం అందించారు. కోవిడ్-19 వైరస్ ఉధృతంగా ఉన్న సమయంలో సుమారు 40 మంది స్టాఫ్ నర్సులు వేర్వేరు ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పద్దతిన ప్రభుత్వం నియమించిందని, కాంట్రాక్ట్ ముగియడంతో తామంతా నిరుద్యోగులుగా ఉండిపోయామని, కొందరు వేరే ఉద్యోగాలలో స్థిరపడ్డారని, మరికొంత మంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ తమకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ నగరానికి చెందిన నాగలక్ష్మి, మరికొంత మంది నిరుద్యోగ యువతులు కోరారు. ఈ నెల 23, 24 లలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా లో పాల్గొనాలని విజయసాయి రెడ్డి వారిని సూచించారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో డాక్ లేబర్ బోర్డు డిపార్ట్ మెంట్ క్యాంటీన్ లో 15 సంవత్సరాలు పైబడి కాంట్రాక్ట్ పద్ధతిలో 28 మంది పనిచేసామని, 2010 వారందరినీ పోర్ట్ ట్రస్ట్ తొలగించిందని దీంతో తామంతా కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ లేబర్ కమీషనర్ ద్వారా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కం లేబర్ కోర్టును ఆశ్రయించామని తాడిచెట్లపాలెం కి చెందిన పి సోమేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019 లో కోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, 4 నెలల్లో ఉద్యోగాల్లో పునర్మియమించాలని ఆదేశించినప్పటికీ పోర్టు అధికారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని చెప్పారు. తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే విధంగా సహకరించాలని కోరుతూ వినతి పత్రంలో కోరారు.

47 వ వార్డు పరిధిలో రాంజి ఎస్టే లో 1వతరగతినుండి 5వ తరగతి ప్రాథమిక పాఠశాల నిర్మించి ఉన్నది 6వతరగతి నుండి 10వ తరగతి చదువుకోవటానికి నేషనల్ హైవే రెండు రోడ్డు దాటి వెళ్ళాల్సి రావడంతో కొండప్రాంతములో ఉన్న బాపూజ నగర్, అంబేద్కర్ ఎస్టే, సురేష్ రామ్ నగర్, చంద్రగిరినగర్, జగ్గజీవనగర్, అరుంధతినగర్, రాంజిఎస్టే, సీపర్ కొలని, పెద్దకొత్తూరు కప్పరాడ, జైప్రకాష్ నగర్, తిక్కవానపాలెం కొలని, సంజీవయ్య కొలనికి చెందిన  స్కూల్ పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు.  కావున రాంజిఎస్టే, స్కూల్ లో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పొడిగించాలని కోరుతూ 47 వ వార్డు కార్పోరేటర్ కంటిపాము కామేశ్వరి వినతిపత్రం సమర్పించారు. కేఆర్ఎం కాలనీకి చెందిన పి వెంకటేశ్వరరావు, తన స్థలంలో (ప్రైవేట్ ప్రాపర్టీ) లో జీవీఎంసీ అధికారులు రోడ్డు వేయడం జరిగిందని, సర్వే జరిపించి తన స్థలం తనకు ఇప్పించాలని కోరారు. చిన్న ముసిరివాడ కు చెందిన విజయలక్ష్మి తన కుమార్తెకు ఇచ్చిన  ఇంటి పట్టాలో తండ్రి పేరు తప్పుగా పడిందని, పట్లాలో పేరు సరి చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. నర్సీపట్నం కి చెందిన పోలిరెడ్డి శ్రీను, పాండ్రంకి కి చెందిన ఎం శంకర్ రావు తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగం కోసం ఈ నెల 23, 24న ఆంధ్ర యూనివర్శిటీలో నిర్వహించనున్న జాబ్ మేళాలో పాల్గొనాలని ఎంపీ విజయసాయి రెడ్డి సూచించారు. తాడిచెట్లపాలెం కి చెందిన  దివ్యాంగుడు వాసుదేవరావు తనకు ఉద్యోగం ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు. అగనంపూడి కి చెందిన పార్వతి, తన స్థలం అదే గ్రామానికి చెందిన కొందరు బలవంతంగా ఆక్రమించుకున్నారని, తన స్థలం తనకు తిరిగి ఇప్పించాలిని కోరుతూ వినతి పత్రం అందించారు. గాజువాక శ్రీనగర్ లో నివాసం ఉంటున్న వెంకటరావు, తనకు 80 శాతం అంగవైకల్యం ఉందని,  , వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరారు.  పెన్సన్లు ఇప్పించాలని, ఉద్యోగాలు ఇప్పించాలని, పలు రకాల వ్యక్తిగత వినతులతో పలువురు ప్రజా దర్బార్ లో వినతులు సమర్పించారు. ప్రజాదర్బార్ కు వచ్చిన దివ్యాంగులు, ఆరోగ్యం సహకరించని వారికి ప్రాధాన్యత కల్పిస్తూ వారి వద్ద నుండి మెదటిగా వినతులు స్వీకరించారు. పలు వినతులపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యలు పరిష్కరించారు. 

Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి