తిరుమల నిర్వాసితులకు స్థానిక పరిపాలన అందించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే


 *తిరుమల నిర్వాసితులకు స్థానిక పరిపాలన అందించిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే...*


- *తిరుపతి ఎమ్మెల్యే భూమన*


తిరుమల, (నిఘా ప్రతినిధి):తి రుమల నిర్వాసితులకు స్థానిక పరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుమల బాలజీనగర్ లో శనివారం సాయంత్రం జరిగిన వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమంలో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తర్వాత... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవ వల్ల స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తిరుమలలో  మొట్టమొదటిసారి  స్థానిక పరిపాలనా  ప్రారంభించారన్నారు.  తిరుమలలో గ్రామ సచివాలయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో ఏర్పాటు చేసి, కార్యదర్శులను నియమించిన కారణంగా స్థానికులకు అధికారులతో నేరుగా సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయన్నారు. అంతేగాకుండా సంక్షేమ కార్యక్రమాల కోసం  ఎవరి దగ్గరా చేతులు చాచించే దుర్భర పరిస్థితి రాకుండా చేశారన్నారు.  సచివాలయాల్లో కార్యదర్శులను నియమించడంతో పెన్షన్ల దగ్గర నుంచి 

ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు తిరుమల నిర్వాసితులకు అందరికీ నేరుగా మహిళలకు  అందుతున్నాయన్నారు. ఇదంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి వల్లే సాధ్యమైందన్నారు.   ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ళ కిందట

 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రోజుకి కనీసం ఇరవై ఐదు వేల మందిని కలిశారని, అందులో కనీసం పది వేల మంది మహిళలుతో సంభాషించారని, వారి సమస్యలేంటో తెలుసు కున్నారని తెలిపారు.  మహిళల సమస్యలను తెలుసుకుని...శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో,  ప్రజల దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల్లో మహిళా సంఘాల రుణాలను నాలుగు విడతల్లో వడ్డీతో సహా చెల్లిస్తామని భగవంతునికి మీద ప్రమాణం చేసి చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో

గత సంవత్సరం, ఈ సంవత్సరం కలిపి 13 వేల కోట్ల రూపాయలు మహిళ సంఘాల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు తెలిపారు. తిరుపతి లొనే ఈ సంవత్సరం 33 కోట్లు, గత సంవత్సరం 32.5 కోట్లు జమచేసినట్టు చెప్పారు. తిరుమల వాసులకు 118 మహిళా సంఘాలకు కలిపి 1.32 కోట్ల రూపాయలు గత ఏడాది జమ చేయగా, ఈ ఏడాది కూడా మరో అదే మొత్తంలో జమ చేశారన్నారు. ఇవి కాకుండా నవరత్నాలతో పాటు 17   పథకాల ద్వారా  రెండు కోట్ల మంది ప్రజలకు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు  లబ్ది చేకూరుస్తున్నట్టు  భూమన వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నారని ప్రశంసించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారాని కొనియాడారు. ప్రజా సేవే దైవ సేవగా నమ్ముతూ, మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్ఛుకున్న

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలంతా అండగా ఉండాలని భూమన పిలుపునిచ్చారు.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం