తెలంగాణ ప్రాంత ప్రజలకు గర్వకారణం:శ్రీ కిషన్ రెడ్డి

 తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వర దేవాలయాన్ని వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునెస్కో జారీ చేసిన సర్టిఫికెట్ శిలాఫలకాన్ని రామప్పలో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి



తెలంగాణ ప్రాంత ప్రజలకు గర్వకారణం:శ్రీ కిషన్ రెడ్డి

స్వదేశ్ దర్శన్ పథకం లోని ట్రైబల్ సర్క్యూటే కింద తెలంగాణాలో చేపట్టిన పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించిన మంత్రి

''ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో రాష్ట్రం నుంచి తొలిసారిగా ఒక ప్రాంతానికి గుర్తింపు లభించడం తెలంగాణ ప్రాంత ప్రజలకు గర్వకారణం".. శ్రీ కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ, ఆరోగ్య కార్యకర్తల అకుంఠిత దీక్షతో టీకాల కార్యక్రమం 100 కోట్ల లక్ష్యాన్ని సాధించింది.. శ్కిషన్ రెడ్డి

ముఖ్యాంశాలు:

·         పాలంపేట  రామప్ప - కాకతీయ రుద్రేశ్వర దేవాలయంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా శిలాఫలకాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆవిష్కరించారు.

·         స్వదేశ్  దర్శన్ పథకం కింద తెలంగాణలో గిరిజన సర్క్యూట్‌లో భాగంగా చేపట్టిన  అనేక పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర మంత్రి 

·         ములుగులో స్వదేశ్ దర్శన్ పథకం కింద కల్పించిన సౌకర్యాలు, ప్రజల కోసం అభివృద్ధి చేసిన సౌకర్యాలను ప్రారంభించిన శ్రీ కిషన్ రెడ్డి.  

·         రుద్రేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన శ్రీ కిషన్ రెడ్డి.

·   శివుడు, విష్ణువు మరియు సూర్యలకు  నిలయమైన  వరంగల్‌ హన్మకొండ  వేయి స్తంభాల దేవాలయాన్ని దర్శించిన కేంద్ర మంత్రి

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఈ నెల 22వ తేదీన ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మండలి శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమాల్లో పలువురు  తెలంగాణ రాష్ట్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ,  భారత పురావస్తు సర్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. 

తెలంగాణాలో స్వదేశీ దర్శన్ పథకం గిరిజన సర్క్యూట్ కింద నిర్మించిన పర్యాటక ప్రాజెక్టులను మంత్రి ప్రారంభించారు. గిరిజన సర్క్యూట్ పథకం కింద ములుగు-లక్నవరం- మేడవరం-తాడ్వాయి-దమరవి -మల్లూర్- భగత జలపాతాలను అభివృద్ధి చేయడానికి 2017 లో కేంద్ర ప్రభుత్వం 75.88 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనిలో భాగంగా పాలంపేట సమీపంలో నిర్మించిన హరిత రెస్టారెంట్ ను మంత్రి ప్రారంభించారు. 

ములుగులో స్వదేశ్ దర్శన్ పథకం కింద కల్పించిన సౌకర్యాలను ప్రారంభించిన శ్రీ కిషన్ రెడ్డి వీటివల్ల పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని దీనితో మేడారం ముఖద్వారంగా ఉన్న ములుగుకు  వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.   

ములుగు రుద్రేశ్వర స్వామి ( రామప్ప) దేవాలయాన్ని వారసత్వ సంపదగా గుర్తిస్తూ యునెస్కో జారీ చేసిన సర్టిఫికెట్ తో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. దేవాలయ విశిష్టత, ప్రాముఖ్యతను దీనిలో పేర్కొన్నారు. '' కాకతీయ రాజుల ప్రతిభ, ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి గుర్తింపుగా ఈ ఘనత లభించింది. రుద్రేశ్వర స్వామి దేవాలయం కాకతీయల కాలం నాటి సృజనాత్మకత, ఇంజనీరింగ్ ప్రతిభ, కళా నైపుణ్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది" అని శ్రీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.   

శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి ముందు శ్రీ కిషన్ రెడ్డి దేవాలయాన్ని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ కిషన్ రెడ్డి  వివిధ దేశాలకు చెందిన నాయకులతో మాట్లాడి రామప్ప గుడికి యునెస్కో గుర్తించేలా ఓటు వేసేలా ఒప్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.  

" ప్రపంచ వారసత్వ జాబితాలో రాష్ట్రానికి స్థానం లభించడం తెలంగాణా ప్రాంత ప్రజలందరికి గర్వకారణం. రామప్ప గుడిలో అన్ని సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసి దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం." అని శ్రీ కిషన్ రెడ్డి తెలిపారు. 

వరంగల్ హన్మకొండ లో ఉన్న శివ,విష్ణు, సూర్య సమేత వెయ్యి స్తంభాల గుడిని శ్రీ కిషన్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ గుడి ఆనాటి శిలా వైభవంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. వరంగల్ కోటని దర్శించిన కేంద్ర మంత్రి అక్కడ ఏర్పాటైన లైట్ అండ్ సౌండ్ కార్యక్రమానికి హాజరయ్యారు. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి అమలు చేస్తున్న చర్యలను మంత్రి వివరించారు. విమానాశ్రయం అభివృద్ధి చెందితే రామప్ప దాని చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తున్న పర్యాటకుల సంఖ్య మరింత పెరిగి ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. 

దేశంలో టీకాల కార్యక్రమం 100 కోట్ల లక్షాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ కిషన్ రెడ్డి కోవిడ్ సమయంలో అనితర సేవలను అందించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. '' ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు ఆరోగ్య సిబ్బంది అంకిత భావంతో దేశంలో టీకాల కార్యక్రమం  100 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంది" అని ఆయన అన్నారు. 

టీకాల కార్యక్రమం 100 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్న సందర్భంగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా దేశంలో 100 పురావస్తు భవనాలను త్రివర్ణ శోభితంగా అలంకరించింది. 

Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి