రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు:పులివెందుల ఇంచార్జ్ ఎమ్మెల్సీ,బి.టెక్ రవి

 


    రాష్ట్రాన్ని  రావణకాష్టం చేస్తున్నారు:పులివెందుల ఇంచార్జ్ ఎమ్మెల్సీ,బి.టెక్ రవి



     పులివెందుల, (నిఘా ప్రతినిధి):  రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయి , ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీద , దాడులు చేయడం చూశాం , ఇప్పుడు ఏకంగా రాష్ట్ర కార్యాలయాల మీద పడి దాడి చేయడం అత్యంత హేయం అని పులివెందుల ఇంచార్జ్ ఎమ్మెల్సీ, బి.టెక్ రవి గారు పేర్కొన్నారు.

పట్టాభి గారి ఇంటి మీద దాడి జరుగగా అది కాకుండా జాతీయ అధ్యక్షులు నారా  చంద్రబాబు ఇంటి మీదకు కూడా ఇటీవల ఇదే తరహా దాడికి యత్నించడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్పష్టం అవుతోంది. ఇంత గుంపులు గుమిగూడి దాడులకు బయలుదేరుతున్నా పోలీస్ వారికి ముందస్తు సమాచారం లేకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్  వ్యవస్థ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం , అక్రమ కేసులు బనాయించడం ప్రతిపక్ష నేతల గొంతును బలవంతంగా నొక్కే ప్రయత్నం జరుగుతుంది.ఈ తెల్లవారుజామున నుండి 

యస్.ఐ లు, సి.ఐ లు శాంతి యుత ధర్నా చేస్తాం అంటే వెళ్లడం కుదరదు అని హౌస్ అరెస్ట్ చేశారు, మరి పులివెందుల పులంగళ్ల సెంటర్ లో వైసీపీ వారు 200 నుండి 300 మంది ఏవిధంగా ర్యాలీకి అనుమతి ఇచ్చారు, మా అధినాయకుని బొమ్మను కూడా కాల్చారు.దీనిని బట్టి పోలీస్ వ్యవస్థ ఓనిసైడ్ చేస్తుందని అర్థం అవుతుంది.*1978 రాజశేఖరరెడ్డి హయాం నుండి పులివెందులను యూనిట్ గా తీసుకొని గతంలో టీడీపీ ఆఫిస్ మరియు నాయకుల ఇండ్లు కాల్చి అనేకమైన మర్డర్లు చేయించి,పులివెందుల ప్రజలను* *ఎట్ల అయితే లొంగదీసుకున్నారో*

*అలాగే రాష్ట్రాన్ని కూడా యూనిట్గా తీసుకొని ప్రజలను* *భయభ్రాంతులకు* 

*గురి చేసి రాష్ట్ర ప్రజలను లొంగదీసుకోవడానికే ఈ అరాచక ప్రయత్నం అని తెలుస్తోంది.ఈ రాష్ట్రంలో ఈ వరుస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది ,రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు అనిపిస్తోంది.* ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం , రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేయకపోతే రాష్ట్రం రావణకాష్టం కాకతప్పదు అని ఎమ్మెల్సీ, బి.టెక్ రవి గారు పేర్కొన్నారు.


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం