అవార్డులు మరెంతో మందికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి – ఉపరాష్ట్రపతి

 అవార్డులు మరెంతో మందికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి – ఉపరాష్ట్రపతి


• తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సారస్వత పరిషత్తు పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది

• ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించేందుకు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారు విశేషమైన కృషి చేశారు

• నెల్లూరుకు చెందిన మణిదీపాల్లో... పుంభావ సరస్వతి స్వరూపులు శ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారు కూడా ఒకరు

• శ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి

• అవగాహన స్వతహాగానే పెంచుకోగలిగినా, ధాటిగా మాట్లాడగలిగే నేర్పు శర్మ ప్రేరణతోనే అలవాటు చేసుకున్నాను

• తమ గురువు గారైన  పోలూరి హనుమజ్జానకీ రామశర్మ  పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా అవార్డును నెలకొల్పి, తొలి అవార్డును  కోవెల సుప్రసన్నాచార్య అందజేసిన ఉపరాష్ట్రపతి


అవార్డులు అందజేయడం ద్వారా మరెంతో మందికి ప్రేరణ కలుగుతుందని, భాషాభివృద్ధి దిశగా యువత ముందుకు రావడానికి దోహదపడుతుందని గౌరవ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు  తెలిపారు. శ్రీ వెంకయ్య నాయుడు డిగ్రీ చదివే రోజుల్లో వారి తెలుగు ఆచార్యులైన శ్పో లూరి హనుమజ్జానకీ రామశర్మ  పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా స్వయంగా అవార్డును నెలకొల్పి, తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్య గారికి అందజేశారు.

తమ ఆచార్యుల పేరిట అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి,  పోలూరి హనుమజ్జానకీ రామశర్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. చదువు నేర్పిన గురువు సాక్షాత్తు భగవంతుడి స్వరూపమన్న పెద్దల మాటలను ఉద్ఘాటించిన ఆయన, శ్రీరాముడు, శ్రీకృష్ణడు లాంటి పురాణపురుషులు సైతం గురు సుశ్రూషలు చేశారన్నారు. డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల,  హనుమజ్జానకీరామ శర్మ మక్కువ పెరిగేలా చేశారన్న ఉపరాష్ట్రపతి, తమ రాజీకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల అవగాహన స్వతహాగానే పెంచుకోగలిగినా, వాటిని ధాటిగా మాట్లాడగలిగే నేర్పు వారి ప్రేరణతోనే వచ్చిందన్నారు.

ఏటా తమ మిత్రులు నిర్వహించే  పోలూరు హనుమజ్జానకీరామశర్మ  జయంతి కార్యక్రమంలో ప్రోటోకాల్ ఇబ్బందుల కారణంగా పాల్గొనలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఇవాళ అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ సందర్భాన్ని గురురుణం తీర్చుకోవడంగా పత్రికల్లో రాశారన్న ఆయన, ఇలాంటివి ఎన్ని చేసినా తల్లిదండ్రుల రుణం, గురువుల రుణం తీర్చుకోలేమని తెలిపారు. పోలూరి హనుమజ్జానకీరామ శర్మ  చూడగానే ఏదో తెలియని గౌరవం కలుగుతుందన్న ఉపరాష్ట్రపతి, సంప్రదాయబద్ధమైన పంచె కట్టు, చక్కని బొట్టు, పండిత వర్చస్సుతో ఇట్టే ఆకర్షించే మూర్తీభవించిన తెలుగుదనం వారిదని తెలిపారు.

తెలంగాణ సారస్వత పరిషత్ అంటే తమకు ప్రత్యేకమైన అభిమానమన్న ఉపరాష్ట్రపతి, మాతృభాషను నేర్చుకోవడం కూడా నేరంగా పరిగణించే రోజుల్లో, తెలుగు భాషను సంరక్షించుకునే సంకల్పంతో 1943లో ఈ సంస్థ ఏర్పాటైందన్నారు. ఎప్పటికప్పుడు నిత్యనూతనత్వాన్ని సంతరించుకుంటూ తెలుగు భాషా వెలుగుల్ని ముందు తరాలకు అందించేందుకు కృషి సలుపుతున్న పరిషత్తు కార్యక్రమాలు స్ఫూర్తి దాయకమన్న ఆయన, సంస్కృతి సారస్వత వికాసానికి కృషి చేయడం, నిరక్షరాస్యతను నిర్మూలించి మాతృభాషలో విద్యావ్యాప్తి కొనసాగించడం లాంటి ప్రధాన ఉద్దేశాలతో ప్రారంభమై... సభలు సమావేశాల నిర్వహణ, ప్రాచీన సారస్వత ముద్రణ, పారిభాషిక-మాండలిక పదకోశాల తయారీ లాంటి కార్యక్రమాలను కొనసాగించడం ముదావహమని తెలిపారు. ఈ సందర్భంగా నాటి అధ్యక్షులు శ్రీ దేవులపల్లి రామానుజరావు, శ్రీ సి.నారాయణరెడ్డి కృషిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, వారి స్ఫూర్తితో తెలంగాణ సారస్వత పరిషత్ ముందుకు సాగుతుండడం అభినందనీయమని తెలిపారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రీ కోవెల సుప్రసన్నా చార్యకి అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, కవిగా... పద్య విద్య మీద గాఢమైన అనురాగం ఉన్నా, ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించేందుకు వారు కృషి చేశారని తెలిపారు. సమాజంలో అక్కడక్కడా పేరుకుపోయిన వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన భారతీయ తత్వవేత్తల దృష్టిని సమగ్ర యోగ భావనలను కవిత్వంలోకి ప్రవేశపెట్టే చొరవ చేసిన శ్రీ సుప్రసన్నాచార్య గారు, ఆధునిక సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదాన్ని ఆవిష్కరించారని తెలిపారు. ఇలాంటి వారి స్ఫూర్తితో మాతృమూర్తి, మాతృభాష, జన్మభూమి, మాతృదేశం, చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ మన భారతీయ సంస్కృతి మనకు నేర్పించిన వసుధైవ కుటుంబక భావన, ప్రకృతిని ప్రేమించడం – ప్రకృతితో కలిసి జీవించడం లాంటి అంశాలను యువత అవగతం చేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డా. జె.చెన్నయ్య... సాహిత్య అకాడమీ ప్రచురణల్లో భాగంగా రచించిన పరిషత్ పూర్వ అధ్యక్షులు శ్రీ దేవులపల్లి రామానుజరావు జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారు భారత అమృతోత్సవాలను పురస్కరించుకుని ప్రచురించిన కవితా సంకలనం అమృతోత్సవ భారతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమృతోత్సవ భారతి పుస్తకంలో ఎంతో స్ఫూర్తి దాగి ఉందన్న ఆయన, నాడు స్వరాజ్య ఉద్యమంలో ఎంతో మంది కవులు దేశభక్తిని ప్రబోధించి ఉద్యమం దిశగా ప్రేరేపించారని, ఈ పుస్తకం ఆ స్ఫూర్తిని మరింత ఉత్తేజితం చేసే విధంగా ఉందని తెలిపారు.

మాతృభాష ఔన్నత్యాన్ని వివరించిన ఉపరాష్ట్రపతి, రాజకీయంగా, సామాజికంగా, వివిధరంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారిలో చాలా మంది వారి వారి మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేశారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి పేర్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పరిపాలన, న్యాయరంగంతోపాటు ప్రజలతోనేరుగా అనుసంధానమయ్యే ప్రతిరంగంలోనూ మాతృభాష వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్నీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. 

అంతకుముందు, శ్రీ పోలూరి హనుమజ్జానకీ శర్మ గారి సాహిత్యసేవను ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి తిలకించారు.

తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ జె. చెన్నయ్య, పురస్కార గ్రహీత ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి డా. ఆర్. ప్రభాకర రావు, ఆల్ ఇండియా రేడియో విశ్రాంత డీజీ శ్రీ రేవూరు అనంత పద్మనాభ రావు, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ కార్యదర్శి శ్రీ మద్దాళి రఘురామ్ సహా పలువురు భాషాభిమానులు, భాషావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి