" వ్యర్థం పై యుద్ధం " కార్యక్రమం లో అందరూ భాగస్వాములు కావాలి : జెడ్పి సీ.ఈ.ఓ. నాగార్జున సాగర్


 * ఈ నెల 7న  వర్కుషాపు, ర్యాలీ.

విశాఖపట్నం, (నిఘాప్రతినిది) : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "వ్యర్థం పై యుద్ధం"  కార్యక్రమంలో  ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) నాగార్జున సాగర్ పిలుపునిచ్చారు.  జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం అమలు, నిర్వహణపై ఆయన, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి తో కలిసి పత్రికా విలేఖరుల  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో "మనం మన పరిశుభ్రత కార్యక్రమం" (ఎం.ఎం.పి.ఎస్)  రెండవ దశలో భాగంగా  జిల్లా లోని 35 మండలాల్లో  ఎంపిక చేసిన 153  గ్రామ పంచాయతీలను ఒ.డిఎఫ్ ప్లస్ గ్రామాలుగా  తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.

అందులో భాగంగా 15 రోజుల పాటు (7-12-2020 నుంచి 21-12-2020 వరకు) పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్ నేతృత్వంలో జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్లో పారిశుద్ధ్యం పై సంపూర్ణ అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు.

ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

జిల్లాలో " వ్యర్థం పై యుద్ధం" చేసేందుకు  ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ నీటి వ్యవస్థ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖల జిల్లా స్థాయి అధికారులతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారులు, అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. 

సంబందిత శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు ఎం.పి.డి.వో.లు, తమ పరిధిలోని గ్రామీణ స్థాయి సిబ్బంది చేత పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగు పరచడం పై ప్రజల్లో సంపూర్ణ అవగాహన తీసుకురావాలన్నారు. 

* జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 7న పక్షోత్సవాల పై వర్కుషాపు, ర్యాలీ 

"మనం - మన పరిశుభ్రత" పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా. ఈ నెల 7వ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఎన్.జి.ఒ.లతో వర్కుషాపు  నిర్వహిస్తామని తెలిపారు. అన్ని అనుబంధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జెడ్పి సీ.ఈ.ఓ  పేర్కొన్నారు.  

8వ తేదిన మండల స్థాయిలో, ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఎన్.జి.ఒ.లతో సమావేశం జరిపి ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. 

9వ తేదీన గ్రామ పంచాయతీ స్థాయిలో సమావేశం మరియు ర్యాలీ  జరుపుతారని అన్నారు. 

10వ తేదీ నుంచి 21వ  తేదీ వరకు  గ్రామ పంచాయతీలను వ్యర్థ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా కోఆర్డినేటర్ ఈ.నాగలక్ష్మి  పాల్గొన్నారు.


జారీ : ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖ పట్నం.

Popular posts
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
Image
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అభివృద్ధి పొద్దులో...ఇక ఆకాశమే హద్దు • పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు,మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి • ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయనున్న 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ' ఒప్పందం • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సమానాభివృద్ధి దిశగా అడుగులు • దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం • ప్రజలు మెచ్చే పరిపాలనలో మరో మెట్టు పైకి చేర్చుతాం • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ' ఎంవోయూలో మంత్రి మేకపాటి • మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శైలిని మెచ్చుకున్న ఐఎస్ బీ ప్రతినిధులు అమరావతి, ఆగస్ట్, 05; ప్రజారంజక పరిపాలనలో కొత్త ఒరవడికి 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం' మరో ఆరంభమవుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమగ్రాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 9.46గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-ఐఎస్ బీతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఏపీ ఈడీబీ, సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ సంతకాలతో ఒప్పందం జరిగింది. ప్రజలు మెచ్చే పారదర్శక పాలను అందించడంలో సీఎం జగన్ రాజీపడరని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే విజ్ఞానం, అధ్యయనం, విశ్లేషణ, పరిశోధన, ప్రణాళికతో కూడిన వ్యూహాత్మక అభివృద్ధికోసమే ఎంవోయూ కుదుర్చుకున్నామని మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు. తాజా ఒప్పందంతో కోవిడ్-19 అనంతర పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్ పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఎంవోయూ కుదుర్చుకోవడం కొత్త ఉత్సాహాన్ని, మరింత బాధ్యతను పెంచిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే వెల్లడించారు. 'యూకే తరహాలో 'పబ్లిక్ పాలసీ ల్యాబ్' ఏర్పాటుకు శ్రీకారం' కచ్చితమైన ఆధారాలతో కూడిన ఆలోచనలను ఆచరణలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ ల్యాబ్" ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఈ ల్యాబ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వప్నించే ప్రజా పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనం, త్వరితగతిన కచ్చితమైన నిర్ణయాలు, ఖర్చులనుతగ్గించడం వంటి లక్ష్యాలను దశలవారీగా చేరుతామని మంత్రి ఆకాంక్షించారు. తద్వారా పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శైలిని మెచ్చుకున్న ఐఎస్ బీ ప్రతినిధులు కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పునరుద్ధరణలో విశాఖ పట్టణాన్ని కీలకంగా మార్చడం, రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యత, ఈ-గవర్నెన్స్ కు పెద్దపీట, నైపుణ్య, శిక్షణలో సరికొత్త విధానాలను తీసుకువస్తామన్నారు మంత్రి మేకపాటి. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలకు వెంటనే పరిష్కారం చేయడంలో శాశ్వత మార్గాలను నిర్మిస్తామని తద్వారా నిర్దేశిత అంచనాలను అందుకుంటూ కచ్చితమైన సమగ్రవృద్ధి సాధిస్తామని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. జూన్ 24న మొదటి సారి సమావేశమై..ఆగస్ట్ 5వ తేదీలోగా అవగాహన ఒప్పందం కుదరడం..అంకితభావం, తపనకు నిదర్శనమని..అందుకు ముఖ్యమంత్రి స్ఫూర్తి అని మంత్రి అన్నారు. ఒప్పందం కార్యక్రమం విజయవంతం చేసిన మంత్రిమేకపాటి గౌతమ్ రెడ్డి ఓఎస్డీ టి.అనిల్, ఐఎస్ బీ కి చెందిన శ్రీధర్ భాగవతుల ద్వయాన్ని మంత్రి సహా ఐఎస్ బీ బృందం ప్రశంసించింది. రాష్ట్ర ప్రజలకు భరోసాతో కూడిన భవిష్యత్ అందించే దిశగా ప్రభుత్వం దార్శనిక ఆలోచనలతో ముందుకు వెళుతుండడాన్ని ఐఎస్ బీ సంస్థ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ అభినందించారు. సరికొత్త మార్పును తీసుకురావడానికి వేగంగా, అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శైలిని మెచ్చుకున్నారు. సమాజ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరడంలో సలహాలను తీసుకుని వాటిని నిర్దేశించుకున్న సమయానికే చేరుకోవడంలో చిత్తశుద్ధిగా భాగస్వామ్యమందిస్తామని డీన్ రాజేంద్ర పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- ఐఎస్ బీ పబ్లిక్ పాలసీ' అవగాహన ఒప్పంద కార్యక్రమంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, పరిశ్రమల శాఖ కమిషనర్, సుబ్రహ్మణ్యం జవ్వాది , నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, ఐ.టీ శాఖ సలహాదారులు, లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఐఎస్ బీ ప్రతినిధులు : ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ఛాట్రే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భగవాన్ చౌదరి, భర్టీ ఇన్ స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ పాలసీ డిజిటల్ ఐడెంటిటి రీసెర్చ్ ఇన్షియేటివ్ విభాగం, ఆచార్య చంద్రశేఖర్ శ్రీపాద, క్లినికల్ ప్రొఫెసర్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , ప్రొఫెసర్ దీప మణి , శ్రీని రాజు సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెట్ వర్క్డ్ ఎకానమీ, ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, తదితరులు పాల్గొన్నారు.
Image