" వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం"


భూవివాదాలకు శాశ్వత పరిష్కారం - 

" వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం"

"మీ భూమి - మా హామీ" కార్యక్రమం భీమిలి లో ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

 భీమునిపట్నం మండలం రామయోగి అగ్రహారం గ్రామంలో మీ భూమి- మా హామీ  కార్యక్రమం ప్రారంభమైంది.

తొలుత గ్రామ భూముల వివరాలు పరిశీలించి, డ్రోన్ లచే భూములు సర్వే చేయడాన్ని ప్రారంభించి, సర్వే హద్దు రాయిని భూమిలో పాతారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ నివాసరావు మాట్లాడుతూ  వైఎస్సార్ జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం లో భూముల సర్వే చేయడం వలన భవిష్యత్తులో ఎవరి భూములు ఆక్రమణకు గురికావని తెలిపారు.

కులం, మతం, వర్గ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు.

అవినీతి రహిత పాలన నందిస్తూ దేశంలో  ఉత్తమ ముఖ్యమంత్రి గా  4 వ స్థానంలో నిలిచారని అన్నారు.

త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి సచివాలయ వ్యవస్థ ను నెలకొల్పినట్లు తెలిపారు.

భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలు సంరక్షిస్తామని తెలిపారు.

నిడిగట్టు పంచాయతీ లోని 1300 మంది ప్రజలు ఈ ప్రభుత్వం లో ఇప్పటివరకు 22 పథకాల ద్వారా రూ.8.62 కోట్లు లబ్ది పొందారని తెలిపారు.

తరువాత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు  భూమిని శాశ్వత వనరుగా ఉంచుకోవాలని, తాత్కాలిక అవసరాల కోసం అమ్ముకోరాదని అన్నారు.

భూమిని నమ్ముకున్న వారెప్పుడూ నష్టపోరని అన్నారు.

భూమి సర్వే కార్యక్రమం నిజమైన యజమానికి శాశ్వత భూ హక్కు కల్పిస్తుందని తెలిపారు.

భూకబ్జా దారులకు చట్టం అంటే భయం లేకుండా పోయిందని అన్నారు.

గ్రామ ఉమ్మడి అవసరాలకు కేటాయించిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే, ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిని కాపాడుకోవాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ గతంలో 1920 లో బ్రిటీష్ పరిపాలన లో భూ సర్వే జరిగిందని, మళ్ళీ 100 సంవత్సరాల తరువాత ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పూర్తి స్థాయిలో సర్వే చేస్తారని తెలిపారు.

ముఖ్యమంత్రి  సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే సెటిల్ మెంట్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, స్థానిక సంస్థలు పంచాయతీ, పురపాలక శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

 జిల్లా లో మొదటగా  సర్వే ఈ గ్రామం నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు.

భూమి  సర్వే డ్రోన్ ల సహాయం తో నిమిషాలలో పూర్తి చేస్తామని,  ఒక సెం..మీ కూడా తేడా లేకుండా కొలిచే యంత్రాలు ఉన్నాయని తెలిపారు.

రైతులు, ప్రజల సహకారం అవసరం అని, 

సర్వే సమయం లో రైతులు వారి సమస్యలు, అభ్యంతరాలు తెలియ జేసి వారి భూములకు సరైన హద్దుల తో పత్రాలు పొందాలని అన్నారు.

 జిల్లా లో సర్వే 3 విడతలుగా జరుగుతుందని, 

 మొదటి విడత లో 920 గ్రామాలు, రెండవ విడత లో 1012 గ్రామాలు, మూడవ విడతలో మిగిలిన 1000 గ్రామాలు పూర్తి చేస్తారని తెలిపారు.

సర్వే పూర్తి అయిన తరువాత భూమి పై శాశ్వత హక్కు కల్పిస్తామని, " కంక్లూజివ్ టైటిల్ " ఇస్తామని తెలిపారు. 

 అత్యంత ఖచ్చితమైన భూ అక్షాంశ - రేఖాంశాలతో భూ కమత పటం ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీవో పి. కిషోర్, సర్వే శాఖ సహాయ సంచాలకులు  విజయ్ కుమార్, తహసీల్దార్ ఈశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి