ఉప రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలి: జాయింట్ కలెక్టరు ఆర్.గోవిందరావు

 


విశాఖపట్నం, ( నిఘాప్రతినిధి):   భారత ఉపరాష్ట్రపతి  ఎం.వెంకయ్య నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని  సంయుక్త కలెక్టరు (అభివృద్ధి, సంక్షేమం) ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. ఈ విషయమై  ఆయన జిల్లా కలక్టరు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.   ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు గౌరవ భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నగరంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.  7 వ తేదీన స్వాగత సత్కారం, ఆయన పాల్గొనే కార్యక్రమాలు  ఎటువంటి లోటు లేకుండా ప్రణాళికా యుతంగా చర్యలు చేపట్టాలన్నారు.  వివిధ శాఖల అధికారులందరూ వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు ముందుగా చేయాలని సూచించారు.  సోమవారం ఉపరాష్ట్రపతి పాల్గొనే మెరైన్‌ ఫిషరీస్ పరిశోధనా సంస్థ సందర్శన, మంగళవారం నిర్వహించే వెబ్ నార్ కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.   గౌరవ ఉపరాష్ట్రపతి బస, పర్యటనలు, వీడ్కోలు నిత్యం వారికి అవసరమైన అన్ని విషయాలపై దృష్ఠి పెట్టి పకడ్బందీగా నిర్వహించాలన్నారు.  విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, ట్రాఫిక్ లలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.  వైద్యశాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వుండాలన్నారు. 

ఈ టెలికాన్ఫరెన్సింగ్ లో  ప్రత్యేక ఉప కలెక్టర్లు  సి.హెచ్.రంగయ్య, ఎం.వి.సూర్యకళ, మత్స్యశాఖ జె.డి. కె.ఫణిప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, జి.వి.యం.సి, విద్యుత్ శాఖ, విపత్తు నిర్వహణ, పౌర సరఫరా తదితర శాఖల అధికార్లు పాల్గొన్నారు. 

జారీ  ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం