విశాఖపట్నం:జాతీయా పత్రికా దినోత్సవం, జాతీయ పాత్రికేయ దినోత్సవ వేడుకలు నవంబరు 16,17 తేదీల్లో విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు
ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకుమాను వెంకట వేణు తెలిపారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు నేమాల హేమసుందరరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేణు మాట్లాడారు.జాతీయ పత్రికా దినోత్సవం జాతీయ పాత్రికేయుల దినోత్సవాన్ని
పురస్కరించుకుని ఏపీలోని వివిధ ప్రాంతాల వారీగా ఉత్తమ జర్నలిస్టులను
ప్రధమ,ద్వితీయ,తృతీయంగా ఎంపికచేసి వారికి సత్కరించి, సన్మానించనున్నట్టు
చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా
ఎంట్రీలను నవంబర్ 4,లోగా విశాఖపట్నంలోని యూనియన్ కార్యాయానికి
పంపాలని కోరారు.కరోనా కట్టడిలో వార్తా కథనాలు కవర్ చేసిన జర్నలిస్టులు ఫ్రింట్
అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారో తెలియజేసే గుర్తింపు
కార్డుతో పాటు, వారు కరోనా సమయంలో మార్చి1, నుండి సెప్టెంబరు 30,2020
వరకు కవర్ చేసిన వార్తా కథనాలు, వీడియో క్లింపింగ్ను ఎంట్రీ దరఖాస్తుతో పాటు జత చేసి పంపాలన్నారు.దరఖాస్తులను
కె. వెంకట వేణు, డోర్ నంబరు 31` 27` 31/1, పావని పబ్లిక్ స్కూల్ ఎదురుగా, కూర్మన్నపాలెం, విశాఖపట్నం-530046,
సెల్ నెం:9030246776, చిరునామాకు పంపాలని పేర్కొన్నారు. సమావేశంలో
యూనియన్ రాష్ర్ట సహాయ కార్యదర్శి
కొయిలాడ పరశురాం పాల్గొన్నారు.
వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం
విశాఖపట్టణం: జాతీయ జర్నలిస్టు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా
జర్నలిస్టులను సత్కరించే
కార్యక్రమంలో భాగంగా వ్యాచరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాకుమాను వెంకట వేణు తెలిపారు.వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ
జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఏపీలోని వివిధ
రీజియన్ల నుంచి ఈ పోటీలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు.నేటి రాజకీయ పార్టీలు, పత్రికల పాత్ర అనే అంశంపై పోటీల్లో పాల్గొనే
వారు తమ ఎంట్రీలను పంపాల్సి ఉంటుందన్నారు.పచ్చదనం` పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ పోటీల్లో పాల్గొనే వారు చదువుతున్న విద్యా సంస్థ గుర్తింపు
కార్డుతో పాటు వ్యాస రచన, చిత్రలేఖనం ఎంట్రీలను ఏపీ ఎడిటర్స్ అండ్
రిపోర్టర్స్ యూనియన్ విశాఖపట్నం రీజియన్ కార్యాయానికి పంపాల్సి ఉంటుందని వివరించారు.