రాష్ట్రాలకు అవసరమైన ఎరువులపై సమీక్షా  : వ్యవసాయ కమీషనర్  హెచ్.అరుణ్ కుమార్  

అమరావతి,( నిఘా ప్రతినిధి ): జాతీయ స్థాయిలో రబీ పంటల జోనల్ కాన్ఫరెన్స్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ కమీషనర్లతో భారత ప్రభుత్వం తరుపున జాయింట్ సెక్రటరీ (.ఎన్.ఎమ్)  అడిదం నీరజ, వ్యవసాయ శాఖ మరియు ఎరువుల శాఖ ఉన్నతాధికారులు వివిధ రాష్ట్రాలకు అవసరమైన ఎరువులపై సమీక్షా   సమావేశం లొ  అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల యొక్క రబీ పంటల విస్తీర్ణం, పండించే పంటలు , భూసార పరిస్థితులను అనుసరించి (ఎన్.పి.కె మరియు సూక్ష్మ పోషకాల లభ్య పరిస్థితులు) మరియు గత 5 సంవత్సరాల వివిధ ఎరువుల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని వివిధ రాష్ట్రాలకు రసాయనిక ఎరువులైన యూరియా, డి..పి, ఎమ్. .పి. ఎస్.ఎస్.పి మరియు కాంప్లెక్స్ ఎరువులను ఆయా రాష్ట్రాల కమీషనర్లతో చర్చించి ఎరువుల శాఖ భారత ప్రభుత్వం వారి సూచనల మేరకు కేటాయించడం జరిగినదిసమావేశంలో ఎరువుల వాడకాన్ని తగ్గించే దిశగా రాష్ట్రాలు రైతులను చైతన్య పరిచి సేంద్రియ వ్యవసాయన్ని ప్రోత్సహించవలెనని మరియు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించవలెనని తెలిపారురబీ 2020-21 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రి 8.05 లక్షల హెక్టార్లు, శనగ 4.03 లక్షల హెక్టార్లు, మినుము 3.85 లక్షల హెక్టార్లు, పెసర 1.36 లక్షల హెక్టార్లు, జొన్న 1.22 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 2.02 లక్షల హెక్టార్లు నువ్వులు 0.33 లక్షల హెక్టార్లు, వేరుశనగ 0.99 లక్షల హెక్టార్లు, ప్రొద్దుతిరుగుడు 0.12 లక్షల హెక్టార్లు, రాగి 0.15 లక్షల హెక్టార్లు, పొగాకు 0.88 లక్షల హెక్టార్లు, మిరప 0.24 లక్షల హెక్టార్లు మరియు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 43. 15 లక్షల హెక్టార్లుగా అంచన.మన రాష్ట్రంలో 79.80 శాతం నేలలలో నత్రజని లభ్యత తక్కువగాను, 15.80 శాతం నేలలలో లభ్యత భాస్వరం తక్కువగాను మరియు 14.71 శాతం నేలలలో పొటాష్ లభ్యత తక్కువగాను ఉన్నవి. సూక్ష్మపోషకాలైనా జింక్ 35 శాతం నేలలలోను, ఐరన్ 24 శాతం నేలలలోను, బోరాన్ 17 శాతం నేలలలోను, మాలిబ్డినం 14 శాతం నేలలలోను లభ్యత తక్కువగా ఉన్న. మన రాష్ట్రం యొక్క పంటవిస్తీర్ణం పోషకాల లభ్యత మరియు గత 3 సంవత్సరాల ఎరువువినియోగాన్ని బట్టి 25 లక్షల వివిధ రకాల ఎరువుల అవసరాన్ని ప్రతిపాదించగా, ఎరువుల శాఖ భారతదేశ ప్రభుత్వం వారు మన రాష్ట్రానికి యూరియా 10.0 లక్షల మెట్రిక్ టన్నులు, డి..పి. 2.0 లక్షల మెట్రిక్ టన్నులు, ఎమ్. .పి. 1.60 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 8.5 లక్షల మెట్రిక్ టన్నులు, ఎస్.ఎస్.పి. 1.00లక్షల మెట్రిక్ టన్నులు (మొత్తం 23.1 లక్షల మెట్రిక్ టన్నులు) కేటాయించబడినదని వ్యవసాయ కమీషనర్  హెచ్.అరుణ్ కుమార్  తెలిపారు


 


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం