ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ నాయకులు

విశాఖపట్నం, (నర్సీపట్నం) :బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సీపీఐ నాయకులు కేంద్రంలో వ్యవసాయ బిల్లులను ఏకపక్షంగా ఆమోమోదించిన బీజేపీ ప్రభుత్వం మోడీ వైఖరి నశించాలంటూ నినాదాలు, స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ మాట్లాడుతూ అధికార మాదంతో ఉరేగుతున్న బీజేపీ ప్రభుత్వం అన్నదాతల కడుపు కొట్టే చట్టాలను తీసుకొస్తుందని దానికి నిరసిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామన్నారు.ఈ దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ రైతుల మెడకు ఉరి బిగిస్తూ రెండు చట్టాలను తీసుకువచ్చిందని, వీటినే వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాలతో నడుస్తున్న ఎల్ ఐ సి, రైల్వే, ఎయిర్ పోర్టులు వంటి సంస్థలను వేలం వేసి అమ్ముకుంటు వచ్చారన్నారు.ఆఖరికి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కూడా కార్పొరేటర్లకు అమ్మి లాభాలు కూడబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ధర్నాలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రాము నాయుడు, జి గురుబాబు,రైతుకులి సంగం రాష్ట్ర కార్యదర్శి గంగా భవాని,మేకా సత్యనారాయణ, రాజబాబు,ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాధా కృష్ణా,రురల్ కార్యదర్శి నల్లబెల్లి శ్రీరామూర్తి పాల్గొన్నారు.


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం