మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి:

 



విశాఖపట్నం,(పశ్చిమ నియోజకవర్గం): భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో,  62వార్డు బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి కార్పోరేటర్ అభ్యర్థి  ములకలపల్లి ప్రకాష్  ఆధ్వర్యంలో, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి హిందువులు మనోభావాలను కించపరిచిన ఆయనకు సరైన  శిక్షను విధించి, గుణపాఠం నేర్పించు స్వామి అని ప్రార్ధిస్తు,  నిరసనగా కార్యక్రమం చేపట్టి, స్థానిక ఆంజనేయస్వామి గుడిలో స్వామివారికి వినతిపత్రం సమర్పించారు  అనంతరం ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు   కొడాలి నాని హిందూ మత విశ్వాసాలను, సంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా, హిందూ  దేవుళ్ళను కించపరుస్తూ రెచ్చగొట్టే విధానంగా చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ ఆయన తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  డిమాండ్ చేస్తూ, ఆయనపై పై చట్టపరమైన చర్యలను  భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295,295a మరియు 153a సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, పారిశ్రామిక ప్రాంతంలో మల్కాపురం పోలీస్ స్టేషన్లో  పారిశ్రామిక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి సి.ఐ.  దుర్గాప్రసాద్ గారికి ఫిర్యాదు చేయడమైనది.కొడాలి నాని  ఎన్.టీవీ ఇంటర్వ్యూ లో చేసిన అనుచిత వ్యాఖ్యలు, హిందూదేశంలో జన్మించి, ఒక హిందువు అయ్యుండి, సాక్షాత్తూ  తిరుమల వేంకటేశ్వరుని పేరు పెట్టుకున్న మీరు ఆ స్వామి వారి సంప్రదాయాలను కించపరిచడం క్షేమించరాని ద్రోహం.  మనకు ఎక్కడైనా త్రవ్వకాలలో పురాతన విగ్రహాలు దొరికితే, వాటిని శుభ్రపరిచి గుడిని కట్టి పూజించే సంప్రదాయం మనది.అలాంటి దేశంలో పుట్టిన ఈ కొడాలి నాని ఒక మంత్రిగా అంతర్వేది రథం కాలిపోతే కోటి రూపాయలతో మరో రథం చేయించి ఇస్తాం, శ్రీ షిర్డీ సాయిబాబా విగ్రహానికి తల విరిగితే సాయిబాబాకు ఏమిటి నష్టమని, ఆంజనేయస్వామి విగ్రహానికి చెయ్య విరిగితే ఆంజనేయస్వామికి ఏమి నష్టమని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా అండదండలు అందిస్తు,  కామధేనువులా నిత్యం కనక వర్షం కురిపిస్తున్న, పవిత్ర పురాతన  హిందూ దేవాలయాలు, విగ్రహాలను చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. అలాంటి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, ఇటువంటి నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అలాంటి మంత్రి నాని గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో  చుక్కా శ్రీనివాసరెడ్డి(ఆర్.ఎస్.ఎస్), 60వార్డు,  జీ. శరత్ చంద్ర గుప్తా(బి.ఎమ్.ఎస్.)58వార్డు వజ్రాపు  ధనుంజయ్ 63వార్డు, డా. ముఖేష్ ఠాకూర్ 62వార్డు,  ఆకాష్ కుమార్ 61వార్డు,  మడక రమణ,  అభినయ్ 59వార్డ్ బిజెపి నాయుకులు, కార్యకర్తలతో  నగేష్ జనసేన నుంచి పాల్గొన్నారు.


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం