భీమిలి నియోజక వర్గంలోపథకాలు అందించడంలో వార్డు వాలంటీర్లు దే  కీలకపాత్ర : పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 


భీమిలి నియోజక వర్గంలోపథకాలు అందించడంలో వార్డు వాలంటీర్లు దే  కీలకపాత్ర : పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు                        
  విశాఖపట్నం,(నిఘా ప్రతినిధి): కోవిడ్-19 నివారణలో భాగంగా లాక్ డౌన్ సమయంలో                  ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  గురువారం భీమిలి నియోజక వర్గంతో పాటు విశాఖపట్నం నగరంలోని కంటైన్ మెంట్ జోన్ అయిన అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్ లలో ఆయన సుడిగాలి పర్యటనలో నిత్యవసరాలను పేదవారికి పంపిణీ చేశారు.  అక్కయ్యపాలెంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా బాగా పనిచేస్తున్నారని, అభివృద్థి పథకాలు ప్రజలకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వాలంటీర్లు ప్రస్తుత తరుణంలో ప్రాణాలకు తెగించి వార్డుల్లో బాగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసులు, వైద్యులు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. కోవిడ్-19 సేవలు అందిస్తున్న వారికి ముఖ్యమంత్రి 50 లక్షల రూపాయలు భీమా కల్పించినట్లు వివరించారు.  అనంతరం రెండు వార్డులకు సంబంధించి వాలంటీర్లకు  నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్, విశాఖపట్నం అర్బన్ తహసిల్థార్ ఎ. జ్ఞానవేణి, తదితరులు పాల్గొన్నారు.
  సింహాచలంలోని పేదలైన అర్చకులు, అక్కడి గిరిజనులకు  25 కేజీల బియ్యం, గోధుమ పిండి, తదితరమైన కిట్లను పంపిణీ చేశారు.  లాక్ డౌన్ సమయంలో పేద అర్చకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం 5 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఇ.ఓ. వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  అనంతరం అక్కడ నుండి బయలుదేరి అడవివరంలో 700 మందికి నిత్యవసర సరుకులు ఆయన పంపిణీ చేశారు.   అక్కడ నుండి ఆనందపురం మండలం మామిడి లోవ గ్రామం చేరుకొని గ్రామ పంచాయితీలోని పేద వారందరికీ నిత్యవసరాల కిట్ లను  పంపిణీ చేశారు.  లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి రేషన్, ఖర్చులకు రూ.1000/-లను అందించినట్లు పేర్కొన్నారు.  గ్రామంలో సమస్యలను గూర్చి అక్కడి ప్రజలను అడుగగా తాగునీటి సమస్య ఉన్నదని చెప్పగా లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించనున్నట్లు చెప్పారు.  అక్కడి తహసిల్థార్ ను గ్రామ సమస్యలు గూర్చి అడిగి మంత్రి తెలుసుకున్నారు.  ప్రభుత్వ పథకాలు గ్రామంలో ఎంతమందికి అందుతున్నాయని మంత్రి ఎంపిడిఓను అడుగగా గ్రామంలో పింఛన్లు 354 మందికి , అమ్మఒడి 278 మందికి, జగనన్న వసతి దీవెన 96 మందికి, ఆరోగ్య శ్రీ 841 మందికి, వాహన మిత్ర 38 మందికి, రైతు భరోసా 309 మందికి, తదితర పథకాలు మరియు లాక్ డౌన్ సమయంలో గ్రామంలో 935 మందికి రేషన్ తో పాటు ఖర్చులకు రూ.1000/-లు ఇచ్చినట్లు ఎంపిడిఓ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్థార్ రామకృష్ణ, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.  అక్కడ నుండి మదురవాడలోని గాయిత్రీ నగర్ కాలనీలో అక్కడ గాయిత్రీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన నిత్యవసరాల సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్, తదితరులు పాల్గొన్నారు.


 


Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి