ధాన్యం అమ్మకంలో రైతులకు యిబ్బందులు ఉంటే 1902 కు ఫోన్ చెయ్యా లి: సంయుక్త కలక్టరు  ఎల్. శివశంకర్

 


ధాన్యం అమ్మకంలో రైతులకు యిబ్బందులు ఉంటే 1902 కు ఫోన్ చెయ్యా లి: సంయుక్త కలక్టరు  ఎల్. శివశంకర్


విశాఖపట్నం, (నిఘా ప్రతినిధి):   ధాన్యం సేకరణకు అధికారులే రైతులవద్దకు వెళ్లి కొనుగోలు చెయ్యాలని సంయుక్త కలెక్టరు ఎల్.శివశంకర్ ఆదేశించారు.  గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో  వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, పౌర సరఫరాలశాఖ, సహకార సంఘాల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.   వై.ఎస్.ఆర్. రైతుభరోసా, ధాన్యం సేకరణ కార్యక్రమం, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 33 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమైనదని, 9 వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్యం నిర్దేశించడమైనదని, యిప్పటివరకు 141 మంది రైతులు తమ పేర్లు రిజిష్టరు చేసుకొన్నారని తెలిపారు.  గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల పేర్లను నమోదుచేయాలని, ప్రతి రైతును రిజిష్టరు చేయాలన్నారు. రైతు ధాన్యం తీసుకువచ్చుటకు తేది, సమయం సూచిస్తూ కూపను జారీచేయాలని తెలిపారు.  అధికారులే రైతు వద్దకు వెళ్లి ధాన్యం పరిశీలించి, కొనుగోలుచేయాలన్నారు.  ఏరైతు గిట్టుబాటు ధరకంటే తక్కువకు అమ్ముకోకూడదని, మంచి రేటు వచ్చిన రైతులు బహిరంగ మార్కెట్టులో అమ్ముకోవచ్చని వారి వివరాలు కూడా నమోదు చేయాలని తెలిపారు. వై.ఎస్.ఆర్. రైతు భరోసా కార్యక్రమంలో  గత సంవత్సరం 3.02 లక్షల మందికి రైతు భరోసా యిచ్చామని, ఈ సంవత్సరం 5.45 లక్షలమంది నమోదు చేసుకొన్నారని, ఈ నెల 30 తేదీ నాటికి వాటి పరిశీలన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకొని త్వరితగతిన పనిని పూర్తిచేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు.   రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు గురించి సమీక్షిస్తూ  మూడు  విడతలలో మంజూరైన కార్యాలయాలను ఈ నెల 29 తేదీనాటికి సిద్దం చేయాలని తెలిపారు. యింకను పూర్తి కావలసిన  రైతు భరోసా కేంద్రాల పనులను  పంచాయతీ రాజ్ శాఖ కు అప్పిగించవలసినదిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  ఎస్.ఇ, పంచాయతీ రాజ్, జాయింటు డైరెక్టరు వ్యవసాయశాఖ,  సహాయ సంచాలకులు ఉద్యానవనశాఖ,  పౌర సరఫరాల జిల్లామేనేజరు, ఇతర అధికారులు హాజరైనారు.


 


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం