• రేషన్ కార్డు కల్గిన కుటుంబానికి 1,000 రూపాయలు ఆర్థిక సాయం తో 1.47 కోట్ల మందికి లబ్ధి

పేదలకు ఉచిత రేషన్ తో ఊరట
• రేషన్ కార్డు కల్గిన కుటుంబానికి 1,000 రూపాయలు ఆర్థిక సాయం తో 1.47 కోట్ల మందికి లబ్ధి
• ఇప్పటి వరకు 1.258 కోట్ల కార్డులకు అందించిన ఆర్థిక సాయం రూ. 1258 కోట్లు
• రేషన్ పంపిణీకి సమయపాలన (టైమ్ స్లాట్) తో కూపన్ లు పంపిణీ 
• అర్హుల ఇంటివద్దకే వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు అందజేత
• రేషన్ సరుకులు 1.47 కార్డుదారులకు గాను 1.29 కోట్ల మందికి పంపిణీ
• రేషన్ సరుకుల పంపిణీ నేటి వరకు 88.06 శాతం పూర్తి


రాష్ట్రంలో రేషన్ కార్డు కల్గిన 1.47 కోట్ల కుటుంబాలకు 1,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం ద్వారా లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించిందని, తదనుగుణంగా ఇప్పటి వరకు 1.258 కోట్ల కార్డులకు రూ. 1258 కోట్లు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి మరియు కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా రేషన్ సరుకులు 1.47 కార్డుదారులకు 1.29 కోట్ల మందికి పంపిణీ చేసామని తెలిపారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో నిరుపేద, అసంఘటిత రంగానికి చెందిన దినసరి కూలీలు, వలస కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటివద్దే ఉచిత రేషన్, ఆర్థిక సాయం అందించి వారికి అండగా నిలుస్తుందన్నారు. లాక్ డౌన్ వల్ల రేషన్ కార్డు కల్గిన వారు ఇబ్బందులు పడకుండా ఉండడానికి మార్చి 29 నుంచి నెల వ్యవధిలోనే 3 విడతలుగా రేషన్‌ సరుకులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి వారికి సక్రమంగా అందేలా చేస్తుందన్నారు. 
పేదలకు కడుపు నింపే క్రమంలో ఏ ఒక్క లబ్ధిదారుడు  కరోనా బారిన పడకూడదనే సదుద్దేశ్యంతో తాజాగా రేషన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రేషన్ షాపుల వద్ద క్యూలు పెరగకుండా లబ్ధిదారులకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయిస్తూ వాలంటీర్ల ద్వారా టైమ్ స్లాట్ తో కూడిన టోకెన్ లు అందజేసిందన్నారు. కూపన్లపై రేషన్‌ షాపు, తేదీ, సరుకులు తీసుకునే సమయం వంటి వివరాలు తెలపడంతో లబ్ధిదారులు ఆ సమయానికి వస్తే సరిపోతుందన్నారు. ఈ నిర్ణయంతో రేషన్ షాపుల వద్ద గమిగూడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్ లో మూడు మీటర్లు దూరం పాటించే విధంగా మార్కింగ్ చేసి భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టిందన్నారు. కేటాయించిన నిర్ణీత సమయానికి ఆయా లబ్ధిదార్లు వచ్చి తమ రేషన్ తీసుకుపోతుండటంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తీసుకువచ్చిన టోకెన్ వ్యవస్థ సత్పలితాలనిచ్చిందని ప్రముఖులు కొనియాడుతున్నారన్నారు. 
రాష్ట్రంలోని మొత్తం 29,620 రేషన్‌ షాపుల్లో ఎక్కువ కార్డులు ఉన్న చోట రద్దీని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా రేషన్‌ కార్డులకు బియ్యం, శనగలు అందిస్తోందన్నారు.  మరోవైపు ఆకస్మాత్తుగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కొంతమంది తమ తమ ప్రాంతాలకు, స్వగ్రామాలకు దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ తాము ఉన్న ప్రాంతాల్లోనే ఉచిత రేషన్ పొందేందుకు ప్రభుత్వం ముందస్తు కసరత్తు చేసిందన్నారు. దీనితో తాము వేరే ప్రాంతాల్లో ఉండిపోవడంతో తమకు అందాల్సిన రేషన్ అందలేదనే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లోనే రేషన్ అందే విధంగా లబ్ధిదారులకు టోకెన్ లు అందజేసిందన్నారు. 
కరోనా వైరస్‌ వల్ల రెడ్‌ జోన్‌గా ప్రకటించిన చోట్ల సురక్షిత ప్రాంతంలో సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రెడ్ జోన్ నేపథ్యంలో ప్రజలు రేషన్ కోసం గుమిగూడితే మరింత ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల సేవలను మరోసారి ఉపయోగించుకుందన్నారు. ఈ ప్రాంతాల్లో వాలంటీర్లే స్వయంగా ఇంటింటికీ వెళ్లి రేషన్ అందజేయడంతో కరోనా ప్రభావం లేకుండా రెడ్ జోన్ ప్రాంతాల్లో సైతం రేషన్ పంపిణీ చేయడంలో ప్రభుత్వ అధికారుల సమన్వయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు ఏర్పాట్లతో అర్హులకు రేషన్ పంపిణీ సజావుగా సాగుతోందని సమాచార శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.
జారీ చేసినవారు: కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ ఇన్ h


Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి