గడపవద్దకే సంక్షేమ పథకాలను అందించే మార్గంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది.

 


ఇంటివద్దకే పెన్షన్ల పంపిణీలో ఏపీ సర్కార్‌ రికార్డు


          అమరావతి:        మధ్యాహ్నం 2 గంటలకు 47 లక్షల పెన్షన్లు పంపిణీ, 80శాతం పూర్తి సత్తాచాటిన వాలంటీర్ల వ్యవస్థ
అవినీతికి, పక్షపాతానికి తావులేకుండా గడపవద్దకే పెన్షన్లు
మొదటి తారీఖునే గడపవద్దకే పెన్షన్లు దాదాపుగా పూర్తికావాలని సీఎం ఆదేశాలు
సీఎం ఆదేశాలతో పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు 
పొద్దు పొడవకముందే పెన్షన్ల పంపిణీ ప్రారంభం
ఇంటివద్దకే వాలంటీర్లు, లబ్ధిదారుల చేతిలో నగదు
పెన్షన్లకోసం పడిగాపులు, క్యూలైన్లు, అలసత్వానికి పూర్తిస్థాయిలో చెక్‌
మారుమూల ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీపై ముందస్తు సన్నాహాలు
ఒకటోతేదీ ఆదివారమైనా లబ్ధిదారులకు అందిన నగదు
గడపవద్దకే పెన్షన్లు సందర్భంగా తొలినెల(ఫిబ్రవరి–2020)లో ఎదురైన సమస్యలకు చెక్‌
అర్హులై గత వారం అందనివారికి, వెరిఫికేషన్‌ పూరై్తన వారికి ఒకేసారి 2 నెలల మొత్తం రూ.4,500 ఒకేసారి
పెన్షన్ల పంపిణీపై రియల్‌ టైం డేటా
జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ
క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికార్యదర్శులు, కలెక్టర్లు, ఇతర అధికారుల పర్యవేక్షణ


అమరావతి: గడపవద్దకే సంక్షేమ పథకాలను అందించే మార్గంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సామాజిక భద్రతా పెన్షన్లే కాకుండా వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చరిత్రలో ఉన్నడూలేని విధంగా శరవేగంగా జరిగింది. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థ సంకల్పంతో ముందుకు సాగింది. నెలలో మొదటి రోజునే పెన్షన్ల పంపిణీ పూర్తిచేయాలంటూ సమీక్షా సమావేశాల్లో సీఎం శ్రీ జగన్‌ స్పష్టంచేయడంతో ఆలక్ష్యాన్ని అందుకోవడానికి ఇవాళ అ«ధికార యంత్రాంగం, వాలంటీర్ల వ్యవస్థ గట్టిగా పనిచేసింది. 
పొద్దు పొడవకముందే వాలంటీర్ల లబ్ధిదారుల గడపవద్దకు చేరుకుని వారిచేతిలో నగదు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు నాటికే 80శాతం పెన్షన్లు పంపిణీకావడం దీనికి నిదర్శనం. అవినీతికి, పక్షపాతానికి తావులేకుండా లబ్ధిదారులకు చేతికే నగదు అందింది. 


పెన్షన్లు పెంపు తొలి అడుగు:


ఎన్నికల ప్రణాళికలో భాగంగా అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు ఏటా పెంచుకుంటూ రూ.3వేలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచిన తొలినెలనుంచే అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ. 2250కు పెంచారు, అర్హత వయస్సును 65 సంవత్సరాలనుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు. 2019 , ఫిబ్రవరి 1 వరకూ అందే పెన్షన్‌ కేవలం 1000లు మాత్రమే. తీవ్రరోగాలతో బాధపడుతున్నవారిక్కూడా కొత్తగా పెన్షన్లుమంజూరు చేశారు. ఈ కేటగిరీ కింద రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ అందిస్తున్నారు. లెప్రసీ పేషెంట్లకు నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నారు. ఈనెల గణాంకాలను చూస్తే.. సుమారు 60 లక్షలమంది సామాజిక భద్రత సహా వివిధ పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. 


తొలిరోజే పంపిణీ:


అవినీతి లేకుండా వివక్ష లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాదు..., వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచి, నిరంతర సామాజిక తనిఖీ ద్వార తుది జాబితాలను అత్యంత పారదర్శక విధానంలో రూపొందించారు. అర్హుల ఎంపికలో అత్యంత పారదర్శత, విప్లవాత్మక విధానాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, పంపిణీలో కూడా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పెన్షన్లకోసం అవ్వాతాతలు బారులుతీరి వేచిచూసిన గత కాలానికి భిన్నంగా వారి ఇంటికే వచ్చి, వారి గడపవద్దనే వాలంటీర్ల ద్వారా పంíపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల ఫిబ్రవరి నుంచి దేశంలో తొలిసారిగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెలలో దాదాపు 60 లక్షల మందికి పెన్షన్ల కింద రూ. 1,384 కోట్లు పంపిణీ విడుదలచేయగా, 2019 జనవరిలో పెన్షన్ల మొత్తం రూ. 490 కోట్లు మాత్రమే.


గతంలో పెన్షన్ల పంపిణీకోసం 7 నుంచి 10 రోజులు పట్టేది. ఇందులో తొలిరోజున అందించే పెన్షన్లు సరాసరి 35శాతం ఉండేది. నెట్‌ వర్క్‌ సమస్యలున్నచోట, మారుమూల ప్రాంతాల్లో పెన్షన్లు తీసుకోవడానికి అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈసమస్యలన్నింటికీ ముగింపు పలుకుతూ, కొత్తగా ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థను చైతన్య పరుస్తూ గడపవద్దకే పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో విజయవంతంగా నిర్వహించింది. మొదటినెల పంపిణీ సందర్భంగా గుర్తించిన సమస్యలనుకూడా ఈ నెలలో సరిచేయడంతో వేగం పెరిగింది. 


పటిష్టమైన యంత్రాంగం: 


వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. వేలిముద్రలేదా, ఐరిస్‌ లేదా ఫేస్‌ రికగ్నైజేషన్‌.. ఇలా పలు ప్రత్యామ్నాయ విధానాల్లో అర్హులను డిజిటల్‌ పద్దతుల్లో గుర్తించే విధానాలను తీసుకు వచ్చారు. 
మొదటి తారీఖు ఆదివారం వస్తుందనే విషయాన్ని ముందుగానే గుర్తించి ఆమేరకు నగదును సిద్ధంచేసి వాలంటీర్లకు పంపించారు.
వాలంటీర్లకు కల్పించిన అవగాహనæ తరగతులు, శిక్షణ కారణంగా వారు మరింత చైతన్యవంతంగా, ఉత్సాహంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పనిచేశారు. 
పనివేళలతో సంబంధం లేకుండా పొద్దుపొడవకముందే.. పెన్షన్ల పంపిణీని మొదలుపెట్టారు.
వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వారు ఏయే కుటుంబాలకు బాధ్యులో డిజిటల్‌ మ్యాపింగ్‌ చేశారు. దీనివల్ల ఎక్కడైనా ఆలస్యం జరిగినా వెంటనే అధికారులు అప్రమత్తంచేశారు.
జిల్లాల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటుచేసుకుని అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేశారు. రియల్‌టైం డేటా పర్యవేక్షణతో సమస్యలను వెనువెంటనే పరిష్కరించారు. 
ఈ విధంగా పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు కావడంతో పొద్దు పొడవకముందే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అత్యంత శరవేగంగా ముందుకు సాగింది. 


సత్తా చాటిన వాలంటీర్లు ... పంపిణీలో వేగం :


దాదాపు 60 లక్షల పెన్షన్లలో 
ఉదయం 8 గంటలకే 26,20,673 
ఉదయం 9 గంటలకు 31లక్షలు 
ఉదయం 10 గంటలకు 37.5 లక్షలు
ఉదయం 11 గటలకు 41.12 లక్షల
మధ్యాహ్నం 12 గంటలకు 43.9 లక్షలు
మ«ధ్యాహ్నం 1 గంటకు 45.24 లక్షలు పంపిణీచేశారు
మధ్యాహ్నం 2 గంటలకు 80శాతానికి పైగా పూర్తయ్యింది.


పెన్షన్లు పంపిణీలో వాలంటీర్లు అంకిత భావాన్ని చూపారు. తొలిరోజే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. లబ్ధిదారులు ఇంట్లో లేకపోతే ఉన్నచోటకే వెళ్లి అందించారు. కొన్ని జిల్లాల్లో అనారోగ్యం బాధపడుతున్న వయోవృద్ధులు ఆస్పత్రిలో ఉంటే.. అక్కడికే వెళ్లి అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీని పరిశీలించారు.


Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి