పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా ఊరట

కొత్త వ్యక్తిగత ఆదాయపు పన్ను వ్యవస్థ-ప్రత్యేకించి మధ్యతరగతి


పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా ఊరట
(కొత్త పన్ను వ్యవస్థకు మార్పుపై పన్ను చెల్లింపుదారులదే నిర్ణయం
కొత్త పన్ను శాతాలవల్ల ప్రభుత్వానికి ఏటా రూ.40వేల కోట్ల రాబడి తగ్గుదల).                                                నవ భవిష్య భారతం, సార్వజనీన ఆర్థికాభివృద్ధి, సంరక్షణపూర్వక సమాజం, ప్రజలందరికీ జీవన సౌలభ్యం ప్రధాన ఇతివృత్తాలుగా రూపొందించిన 2020-21 కేంద్ర బడ్జెట్‘ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‘సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా 16 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా ప్రకటించారు. దేశ పౌరుల ఆదాయ వృద్ధి చర్యలద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచడంపైనా బడ్జెట్ దృష్టి సారిస్తుందని ఆమె తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. మొత్తంమీద అవినీతి రహిత, విధాన ఆధారిత సుపరిపాలనతో ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని విశదీకరించారు. బడ్జెట్  ప్రతిపాదనల మేరకు వివిధ రంగాలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి:




⦁ ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని వర్తింపజేస్తారు. ప్రత్యేక కిసాన్ రైలు, కిసాన్ ఉడాన్ పథకాలను ప్రవేశపెట్టనున్నారు.


⦁ వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 2020-21 సంవత్సరానికి రూ.15 లక్షల కోట్లుగా నిర్దేశించారు.


⦁ వ్యక్తిగత ఆదాయం పన్నుపై కొత్త విధానం ప్రకటించారు. ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు రాయితీలు, మినహాయింపులు వదులుకుని ఈ ప్రత్యామ్నాయ విధానాన్ని ఎంచుకోవచ్చు.
⦁ విద్యుదుత్పాదనలో కొత్త దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 15 శాతంగా నిర్ణయించారు.


⦁ దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై ఆరోగ్య సెస్ విధించారు.
⦁ ప్రత్యక్ష పన్నుల వివాదాలను తగ్గించేందుకు ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రతిపాదించారు.
⦁ సరళీకృత వస్తుసేవల పన్ను (GST) రిటర్నులు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.


⦁ దేశంలోని అన్ని జిల్లాల్లో 2024 కల్లా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.


⦁ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.67,112 కోట్లు కేటాయించారు.


⦁ మానవ వనరుల అభివృద్ధికి రూ.99,312 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1, 22,398 కోట్లు, వ్యవసాయం-రైతు సంక్షేమానికి రూ.1,42,762 కోట్లు వంతున కేటాయించారు.


దాయపు పన్నుకు సంబంధించి కొత్త విధానంపై ఆర్థిక మంత్రి వివరణ మేరకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా ఊరట లభిస్తుంది. అయితే, ప్రస్తుత విధానం కింద పలు సెక్షన్ల ప్రకారం వారు పొందుతున్న రాయితీలు, మినహాయింపులన్నిటినీ వదులుకుని కొత్త పథకంలోకి మారవచ్చు. దీనివల్ల వారిపై పన్ను భారం తగ్గిపోతుందని మంత్రి చెప్పారు. ఉదాహరణకు రూ.15 లక్షల వార్షికాదాయంగల వ్యక్తి ప్రస్తుత శ్లాబు ప్రకారం రూ.2,73,000 మేర పన్ను చెల్లించాల్సి ఉంటుందని, కొత్త వ్యవస్థలోకి మారితే కేవలం రూ.1,95,000 చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. తద్వారా రూ.73,000 ఆదా అవుతుందని వివరించారు. అయితే, కొత్త పన్ను శ్లాబులవల్ల ప్రభుత్వం ఏటా రూ.40,000 కోట్లు నష్టపోతుందని అంచనా.



Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి